News March 28, 2025
1న ఉదయం 7 గంటలకే సామాజిక పింఛన్లు పంపిణీ ప్రారంభం

జిల్లా పరిధిలో ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం మే 1న ఉదయం ఏడు గంటలకే ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లాలో 2,61,841 మంది లబ్ధిదారులు ఉండగా వారికి రూ.111.82 కోట్లు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి లబ్ధిదారులకు నగదు అందజేస్తారన్నారు. ఆరోజు పింఛన్ పొందే ప్రతి ఒక్కరు ఇంటి వద్ద ఉండి నగదు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News November 27, 2025
కామారెడ్డిలో పటిష్ట భద్రత.. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం

కామారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 780సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను (క్రిటికల్ 223, సెన్సిటివ్ 557) గుర్తించారు. సమస్యాత్మక కేంద్రాలలో వెబ్ కాస్ట్ ద్వారా నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. 38మైక్రో ఆబ్జర్వర్లను నియమించారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ సెల్ 9908712421 ఏర్పాటు చేశారు.
News November 27, 2025
పెద్దపల్లి: టెక్నికల్ కోర్సులకు ఉచిత శిక్షణ

PDPL ఎంపీడీవో ఆఫీసు ప్రాంగణంలోని టాస్క్ రీజనల్ సెంటర్లో JAVA, PYTHON, C, C++, HTML, CSS, JAVA SCRIPT, TALLY విత్ GST, APTITUDE, రీజనింగ్, SOFT SKILLS వంటి పలు టెక్నికల్ కోర్సులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఇన్ఛార్జ్ కౌసల్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పాసైన నిరుద్యోగులు డిసెంబర్ 6లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె సూచించారు. వివరాలకు: 9059506807ను సంప్రదించాలని కోరారు.
News November 27, 2025
స్వెటర్లు ధరిస్తున్నారా?

చలికాలంలో స్వెటర్లు వాడటం కామన్. అయితే వాటి శుభ్రతపై నిర్లక్ష్యం వద్దంటున్నారు వైద్యులు. ప్రతి 5-7సార్లు ధరించిన తర్వాత ఉతకాలని సూచిస్తున్నారు. వాటి క్వాలిటీ, ఎంతసేపు ధరించాం, లోపల ఎటువంటి దుస్తులు వేసుకున్నాం, శరీర తత్వాలను బట్టి ఇది ఆధారపడి ఉంటుందట. స్వెటర్ లోపల కచ్చితంగా దుస్తులు ఉండాలని, శరీరం నుంచి తొలగించిన తర్వాత గాలికి ఆరబెట్టాలని.. లేకపోతే చర్మవ్యాధులకు ఆస్కారముందని హెచ్చరిస్తున్నారు.


