News March 28, 2024

1న నన్నయలో బీఈడీ స్పాట్ అడ్మిషన్స్

image

ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ ప్రవేశాలకు ఏప్రిల్ 1వ తేదీన స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నామని రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ తెలిపారు. బీఈడీ రెండేళ్ల కాలవ్యవధి కోర్సులో ప్రవేశాలకు ఆసక్తి, అర్హత ఉన్నవారు హాజరు కావాలని కోరారు. రెగ్యులర్ సీట్లు 14, ఈడబ్ల్యూఎస్ 5 సీట్లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. తప్పనిసరిగా ఏపీ ఎడ్‌సెట్-2023 ప్రవేశ పరీక్షకు హాజరై ఉండాలన్నారు.

Similar News

News September 29, 2025

అఖండ గోదావరికి అయిదు వంతెనల హారం

image

రాజమండ్రి- కొవ్వూరును కలుపుతూ గోదావరి నదిపై నిర్మించిన ఐదు వంతెనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 1975లో నిర్మించిన ఆసియాలోనే రెండో అతిపెద్దదైన రోడ్డు కమ్ రైల్వే వంతెన, బ్రిటిష్ హయాంలోని హేవలాక్ బ్రిడ్జి గోదావరికి మణిహారాలుగా ఉన్నాయి. ఆర్చ్ ఆకారపు రైలు వంతెన, 2015లో నిర్మించిన 4 లైన్ల రోడ్డు వంతెన, ధవళేశ్వరం ఆనకట్ట ఈ ఐదు అద్భుతాలు గోదావరి అందాలను ఇనుమడింపజేస్తున్నాయి.

News September 29, 2025

రాజమండ్రి ‘టెంపుల్ స్ట్రీట్’గా గౌతమి ఘాట్

image

రాజమండ్రిలోని గౌతమి ఘాట్ వద్ద, గోదావరి నది తీరంలో ప్రసిద్ధ ఆలయాలు కొలువై ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ‘టెంపుల్ స్ట్రీట్’గా పిలుస్తారు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఇస్కాన్ టెంపుల్, గాయత్రి పీఠం, దత్త పీఠం వ్యాసాశ్రమం, శ్రీ రంగనాథ ధామం, అయ్యప్ప, సరస్వతి ఆలయాలతో పాటు మహాకాళేశ్వర ఆలయం కూడా ఉంది. ఈ మహాకాళేశ్వర స్వామికి నిత్యం చిత భస్మంతో అభిషేకం చేస్తారు. ఈ ప్రాంగణంలో అనేక ఉప ఆలయాలు కూడా ఉన్నాయి.

News September 29, 2025

రాజమహేంద్రవరంలో కందుకూరి స్మృతులు

image

రాజారాజా నరేంద్రుడు పాలించిన రాజమహేంద్రవరంలోని కందుకూరి వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16న జన్మించారు. ఇక్కడి నుంచే ఆయన ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సతీసహగమనంపై పోరాటం చేసి భార్య రాజ్యలక్ష్మితో కలిసి వితంతుకు తొలి పునర్వివాహం ఇక్కడే చేశారు. సమాజంలో దురాచారాలపై ఆయన ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించారు. ఇప్పటికీ ఆయన ధరించిన కోటు, కుర్చీ, లాంతరు ఇప్పటికీ ఇక్కడ భద్రంగా ఉన్నాయి.