News November 29, 2024
TGలో మళ్లీ 1, 1, 1, 2, 2, 5, 5 ర్యాంకుల లొల్లి!

పదో తరగతి పరీక్షల్లో గ్రేడింగ్ సిస్టమ్ను ఎత్తేయాలన్న TG నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఇప్పటికే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనేంత వరకు చదువూ.. చదువూ.. అంటూ బట్టీ పట్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ర్యాంకుల ర్యాట్రేస్ వల్ల స్టూడెంట్స్పై ఒత్తిడి ఖాయమని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. 1, 1, 1, 2, 2, 3, 3, 3, 4 టాప్10 ర్యాంకులన్నీ మావేనన్న ప్రకటనలు షురూ అవుతాయని నెటిజన్లు అంటున్నారు.
Similar News
News December 9, 2025
ఫ్రాడ్ కాల్స్ వేధిస్తున్నాయా?

ప్రస్తుతం చాలా మందిని ఫ్రాడ్ కాల్స్, మెసేజ్లు వేధిస్తున్నాయి. అయితే వాటిపై మనం ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. సంచార్ సాథీ (<
News December 9, 2025
నువ్వుల విత్తనాలను వెదజల్లేకంటే విత్తడం మేలట

నువ్వుల పంట కోసం విత్తనాలను సాధారణంగా రైతులు వెదజల్లుతారు. అయితే విత్తనాన్ని వెదజల్లడం కంటే విత్తడం మేలంటున్నారు నిపుణులు. విత్తనాలను వరుసల మధ్య 30సెం.మీ, మొక్కల మధ్య 15సెం.మీ దూరం ఉండేటట్లు విత్తుకోవాలంటున్నారు నిపుణులు. విత్తనాలను వరుసలలో విత్తితే కలుపు తీసుకోవడానికి అనువుగా ఉండటమే కాకుండా మొక్కకు నీరు, పోషకాలు, సూర్యరశ్మి సమానంగా అంది కొమ్మలు బాగా వృద్ధి చెంది అధిక దిగుబడులు సాధించవచ్చు.
News December 9, 2025
మహాలక్ష్మి పథకంతో మహిళలకు రూ.8,459 కోట్లు ఆదా: పొన్నం

TG: మహాలక్ష్మి పథకం ద్వారా RTCలో మహిళలకు ఉచిత ప్రయాణాలు మొదలై రెండేళ్లు పూర్తయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండేళ్లలో మహిళలు 251 కోట్ల జీరో టికెట్ల ద్వారా రూ.8,459 కోట్లు ఆదా చేసినట్లు వెల్లడించారు. బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా మహిళలను బస్సులకు యజమానులుగా చేసిన ప్రభుత్వంగా నిలిచిందని పేర్కొన్నారు.


