News March 28, 2025
మిడ్ డే మీల్కు 1.14L టన్నుల సన్న బియ్యం: నాదెండ్ల

AP: ఏప్రిల్ నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సివిల్ సప్లైస్ 227వ బోర్డ్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఖరీఫ్లో 5.61L మంది రైతుల నుంచి 35.48L టన్నులను కొని, వారి ఖాతాల్లో రూ.8,138Cr జమ చేసినట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి 1.14L టన్నుల సన్న బియ్యాన్ని సరఫరా చేశామన్నారు. ప్రైవేటు గిడ్డంగులను గ్రీన్హౌస్ గిడ్డంగులుగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News January 22, 2026
జనవరి 22: చరిత్రలో ఈ రోజు

1882: స్వాతంత్ర్య సమరయోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు జననం
1885: ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు జననం
1918: కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటు
1940: తెలుగు భాషావేత్త గిడుగు రామమూర్తి మరణం
1970: బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది
2014: సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరణం (ఫొటోలో)
News January 22, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 22, 2026
టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి: లోకేశ్

జెరోదా ఫౌండర్ నిఖిల్ కామత్తో మంత్రి లోకేశ్ దావోస్లో భేటీ అయ్యారు. ‘ప్లాట్ఫామ్ ఇంజినీరింగ్, ట్రేడింగ్ అల్గారిథమ్స్పై దృష్టి సారిస్తూ విశాఖలో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ నెలకొల్పండి. ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎకో సిస్టమ్ బలోపేతానికి లీడ్ మెంటర్గా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో భాగస్వామ్యం వహించండి. కాలేజ్ స్థాయి వరకు ఫైనాన్సియల్ లిటరసీ కార్యక్రమం అమలుకు సహకరించండి’ అని విజ్ఞప్తి చేశారు.


