News February 17, 2025

కుంభమేళాలో నేడు 1.35కోట్ల మంది స్నానాలు

image

144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాకు భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. దేశ నలుమూలల నుంచి తరలి వస్తుండటంతో ప్రయాగ్‌రాజ్ కిటకిటలాడుతోంది. నేడు త్రివేణీ సంగమంలో 1.35 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జనవరి 13 నుంచి ఇప్పటి వరకు 54.31 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్ విచ్చేసినట్లు ప్రకటించారు. ఈ నెల 26తో మహాకుంభమేళా ముగియనుంది.

Similar News

News November 17, 2025

మాఘీ సీజన్, లేట్ రబీకి అనువైన జొన్న రకాలు

image

ఏపీలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో మాఘీ సీజన్ కింద.. లేట్ రబీ కింద ప్రకాశం, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో జొన్న పంటను సాగు చేస్తారు. ఈ సీజన్లకు అనువైన వరి రకాలు NTJ-5, N-15, C.S.V-15, C.S.V-17, C.S.V-23, C.S.V-31, M-35-1. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు C.S.H-14, C.S.H-15 R, C.S.H-18, C.S.H-16, C.S.H-35, C.S.H-23. నిపుణుల సూచన మేరకు ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవాలి.

News November 17, 2025

మాఘీ సీజన్, లేట్ రబీకి అనువైన జొన్న రకాలు

image

ఏపీలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో మాఘీ సీజన్ కింద.. లేట్ రబీ కింద ప్రకాశం, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో జొన్న పంటను సాగు చేస్తారు. ఈ సీజన్లకు అనువైన వరి రకాలు NTJ-5, N-15, C.S.V-15, C.S.V-17, C.S.V-23, C.S.V-31, M-35-1. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు C.S.H-14, C.S.H-15 R, C.S.H-18, C.S.H-16, C.S.H-35, C.S.H-23. నిపుణుల సూచన మేరకు ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవాలి.

News November 17, 2025

షేక్ హసీనాకు మరణశిక్ష

image

బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ (ICT) సంచలన తీర్పు ఇచ్చింది. ఢాకా అల్లర్ల కేసులో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. గతేడాది విద్యార్థుల ఆందోళనల సమయంలో 1400 మంది చావుకు కారణమయ్యారని ఆమెతో పాటు మరో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చిన కోర్టు తాజాగా మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం హసీనా భారత్‌లో తల దాచుకుంటున్నారు.