News June 19, 2024

రైల్వే భద్రతా విభాగంలో 1.5లక్షల పోస్టులు ఖాళీ

image

రైల్వే భద్రతా విభాగంలో మంజూరైన పది లక్షల పోస్టులకు గాను 1.5లక్షలకు పైగా ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ తెలిపింది. RTI దరఖాస్తుకు ఈ మేరకు సమాధానమిచ్చింది. ఇందులో లోకో పైలట్ 14,429, అసిస్టెంట్ డ్రైవర్ 4,337 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని తెలిపింది. అలాగే రైల్వే భద్రతా ప్రాజెక్టుల కోసం 2004-14 మధ్య కాలంలో రూ.70 వేల కోట్లు, 2014-24 సంవత్సరాల్లో రూ.1.78 లక్షల కోట్లు వెచ్చించినట్లు ఓ అధికారి చెప్పారు.

Similar News

News December 14, 2025

ఏకాగ్రతకు చిహ్నం ‘కుంకుమ’

image

కుంకుమను పసుపు, సున్నపు రాయి కలిపి తయారుచేస్తారు. అయితే ఇప్పుడు ఆ ప్రక్రియ చాలావరకు మారిపోయింది. రసాయనాలు వాడుతున్నారు. అలా తయారైన కుంకుమనే మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. అయితే అసలైన కుంకుమ ధరించడం ఎంతో ముఖ్యమని చెబుతున్నారు పండితులు. కనుబొమ్మల నడుమ కుంకుమధారన మనలో ఏకాగ్రతను పెంచుతుందని అంటున్నారు. కుదిరితే ఇంట్లోనే కుంకుమ తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు.

News December 14, 2025

మరికాసేపట్లో..

image

TG: ఇవాళ ఉదయం 7 గంటల నుంచి రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. 415 GPలు ఏకగ్రీవం కాగా మిగిలిన 3,911 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 38,350 పోలింగ్ సెంటర్లను ఈసీ ఏర్పాటు చేసింది. మొత్తం 57,22,665 మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుండగా 2 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి.

News December 14, 2025

కుంకుమను ఇంట్లోనే తయారు చేసుకోండిలా..

image

మార్కెట్‌లో దొరికే నకిలీ కుంకుమతో చర్మ సమస్యలు రావొచ్చు. అయితే ఇంట్లోనే సహజంగా కుంకుమను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం పసుపు, సున్నం ఉంటే చాలు. ముందుగా ఆర్గానిక్ పసుపు తీసుకోవాలి. అందులో చిటికెడు సున్నం వేయాలి. ఆ తర్వాత నాలుగైదు చుక్కల నీళ్లు పోసి బాగా కలపాలి. సున్నం వేయడం వల్ల ఆ మిశ్రమం ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ మిశ్రమాన్ని ఎండలో ఆరబెడితే పొడిగా మారి, నాణ్యమైన కుంకుమ తయారవుతుంది.