News March 19, 2024
1.61వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేసి బిల్డర్లకు కేటాయింపు, కలెక్టర్

కామారెడ్డి ,2022- 23 రబీకి సంబంధించిన ధాన్యాన్ని బిడ్డర్లకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అప్పగించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైస్ మిల్లర్లను కోరారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్ల తో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత రబీకి సంబంధించి లక్ష 61వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేసి ప్రభుత్వం బిడ్డర్లను కేటాయించిందని అన్నారు.
Similar News
News November 4, 2025
నిజామాబాద్: ఈవీఎం గోడౌన్ను సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్లోని వినాయకనగర్లో ఉన్న ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్కు వేసిన సీళ్లను పరిశీలించారు. అక్కడ పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ పాల్గొన్నారు.
News November 4, 2025
NZB: 6,568 మంది రైతులకు రూ.30.80 కోట్ల బోనస్ చెల్లింపు

వానకాలం సీజన్కు సంబంధించిన NZB జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన 6,568 మంది రైతులకు రూ.30.80 కోట్లు బోనస్ చెల్లించినట్లు DSO అరవింద్ రెడ్డి తెలిపారు. ఈ రైతుల 6,16,110 క్వింటాళ్లకు సంబంధించి రూ.500 చొప్పున బోనస్ చెల్లించామన్నారు. జిల్లాలోని 487 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,90,616 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు ఆయన వివరించారు.
News November 3, 2025
NZB: ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీలపై DM&HO సమీక్ష

నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు ఆసుపత్రిని తనిఖీ చేసే బృందాలు నిర్వహించే విధులపై DM&HO డాక్టర్ బి రాజశ్రీ సోమవారం సమీక్ష జరిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో తనిఖీ బృందాలుగా ఆసుపత్రిలో తనిఖీకి వెళ్ళినప్పుడు ఏమేమి చూడాలి, ఫామ్ ఎఫ్ను ఏ విధంగా ఆడిట్ చేయాలి, అక్కడ రిజిస్టర్లను ఏ విధంగా చెక్ చేయాలి, ఏ రకమైన పద్ధతులను అవలంబించాలి మొదలగు విషయాలపై వైద్యులకు అవగాహన కలిగించారు.


