News December 3, 2024
ఈ నెలాఖరుకు లక్ష గృహ ప్రవేశాలు: అజయ్ జైన్

AP: గత ప్రభుత్వం ప్రారంభించిన గృహ సముదాయాలను త్వరగా పూర్తి చేయడంతోపాటు కొత్త ఇళ్లను నిర్మించేందుకు కూటమి సర్కార్ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే 7.5 లక్షల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ వెల్లడించారు. మరో 8 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈ నెలాఖరుకు లక్ష మందితో సామూహిక గృహ ప్రవేశాలను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు.
Similar News
News November 9, 2025
ఆముదం పంటలో దాసరి పురుగు నివారణ ఎలా?

దాసరి పురుగు ఆముదం పంటను జనవరి మాసం వరకు ఆశిస్తుంది. ఈ పురుగు పంటపై ఆశించిన తొలిదశలో ఆకులను గోకి తర్వాత రంధ్రాలు చేసి ఆకులన్నీ తింటాయి. పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లేత కొమ్మలను, కాడలను, పెరిగే కాయలను తిని పంటకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి. దాసరి పురుగుల నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా థయోడికార్బ్ 1.5 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ కలిపి పంటపై పిచికారీ చేయాలి.
News November 9, 2025
PGIMERలో ఉద్యోగాలు

చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(<
News November 9, 2025
జూబ్లీ‘హిట్’ అయ్యేదెవరో?

హాట్ సీటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తుది దశకు చేరింది. హోరాహోరీగా సాగిన ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. దివంగత MLA మాగంటి గోపీనాథ్ భార్యకే టికెట్ ఇచ్చిన BRS సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న INC నవీన్ యాదవ్ గెలుపునకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అటు జూబ్లీహిల్స్లో కాషాయ జెండా ఎగురవేస్తామని BJP చెబుతోంది. మీ కామెంట్?


