News March 22, 2025
1 స్కీమ్: ₹1.61LCR పెట్టుబడి, 11.5లక్షల జాబ్స్

PLI స్కీమ్స్తో ₹1.61L CR పెట్టుబడులు, ₹14L CR ప్రొడక్షన్, ₹5.31L CR ఎగుమతులు నమోదయ్యాయని కామర్స్ మినిస్ట్రీ ప్రకటించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 11.5లక్షల ఉద్యోగాల సృష్టి జరిగిందని తెలిపింది. 14 రంగాల్లో 764 దరఖాస్తుల్ని ఆమోదించామని పేర్కొంది. బల్క్ డ్రగ్స్, మెడికల్ డివైజులు, ఫార్మా, టెలికం, వైట్ గూడ్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, డ్రోన్స్ రంగాల్లో 176 MSMEలు లబ్ధి పొందాయని వెల్లడించింది.
Similar News
News March 23, 2025
IPL చరిత్రలో ఆర్చర్ చెత్త రికార్డ్

IPL-2025లో RR బౌలర్ జోఫ్రా ఆర్చర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఇవాళ ఉప్పల్లో SRHతో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు వేసి 76 పరుగులు ఇచ్చారు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఓ స్పెల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా మారారు. మరోవైపు ఇదే మ్యాచ్లో తీక్షణ(52), సందీప్ శర్మ(51) ధారాళంగా పరుగులు ఇచ్చారు. అలాగే ఓ ఇన్నింగ్స్లో అత్యధిక బౌండరీలు(46) నమోదైన మ్యాచ్గానూ రికార్డ్ సృష్టించింది.
News March 23, 2025
హెచ్చరిక: అలా చేస్తే ఇక లైసెన్స్ రద్దు?

TG: తరచూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వాహనదారులకు షాక్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నట్లు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వాటిని మళ్లీ పునరుద్ధరించకపోవడమే కాక వారి వాహనాల రిజిస్ట్రేషన్లు కూడా చేయబోమని పేర్కొన్నారు. త్వరలోనే ప్రభుత్వం ఈ నిబంధనను అమలుచేయనున్నట్లు తెలుస్తోంది.
News March 23, 2025
ఆస్పత్రిలో చేరిన అల్లు అర్జున్ నాయనమ్మ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ కనకరత్నం (95) ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెను హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్పై వైద్యులు ట్రీట్మెంట్ చేస్తున్నారు. కాగా కనకరత్నం గ్లోబల్స్టార్ రామ్చరణ్కు అమ్మమ్మ అన్న విషయం తెలిసిందే.