News February 3, 2025

10న జాతీయ నూలి పురుగుల నిర్మూలన కార్యక్రమం: కలెక్టర్

image

జాతీయ నూలి పురుగుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 10న మొదటి దశ జాతీయ నూలి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జాతీయ నూలి పురుగుల నిర్మూలన కార్యక్రమ నిర్వహణపై జిల్లా స్థాయి అధికారులతో టాస్క్ ఫోర్స్ సమావేశాన్ని నిర్వహించారు.

Similar News

News April 17, 2026

ఎల్లారెడ్డి: కూలర్ మరమ్మతులు.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. హజీపూర్ గ్రామానికి చెందిన రాజిరెడ్డి (47) తన ఇంట్లో కూలర్ మరమ్మతులు చేస్తుండగా అనుకోకుండా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో తీవ్రగాయాలు కావటంతో మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉండగా, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.

News April 17, 2026

ప్రొద్దుటూరు: కుటుంబంలో నలుగురూ మృతి.!

image

ప్రొద్దుటూరు ఈశ్వరరెడ్డి నగర్లో గత నెల 26న అత్త మందలించిందని భువనేశ్వరి కూల్ డ్రింక్‌లో విషం కలిపి ముగ్గురు పిల్లలకు తాగించి తాను కూడా తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ 28న భువనేశ్వరి మృతి చెందింది. పిల్లలను మెరుగైన చికిత్స కోసం చెన్నై ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఈ నెల 10న లిఖిత(11), 15న గణ(9), (నిన్న) 16న సుష్మ (13) మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదం అలముకుంది.

News April 17, 2026

GDK: ‘జైత్రయాత్రకు గులాబీ శ్రేణులు తరలి రావాలి’

image

ఈనెల 20న జగిత్యాలలో జరిగే జైత్రయాత్ర సభను విజయవంతం చేయాలని PDPL జిల్లా BRS అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. GDKలో శుక్రవారం జరిగిన గులాబీ పార్టీ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధిక్కార స్వరం వినిపించేందుకే KCR సభ నిర్వహిస్తున్నారని అన్నారు. నియంతలా వ్యవహరిస్తున్న CM రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు.