News February 7, 2025
10న శ్రీశైలానికి మంత్రులు

శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 23న సీఎం చంద్రబాబు శ్రీశైలానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న పలువురు మంత్రులు క్షేత్రానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించనున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణరెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, అనిత, అనగాని సత్యప్రసాద్, అలాగే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా ఏర్పాట్లు పరిశీలిస్తారు.
Similar News
News November 20, 2025
హైదరాబాద్ ఇమేజ్ను పెంచిన KTR: సబిత

BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపునకు దిగిందని మాజీ మంత్రి, మహేశ్వరం MLA సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. ప్రతి పక్షాన్ని, ప్రశ్నించే గొంతులను నొక్కేసే ప్రయత్నం CM రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. పూర్తి పారదర్శకతతో ఫార్ములా-ఈ రేసులను నిర్వహించి హైదరాబాద్ ఇమేజ్ను పెంచిన KTRపై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికమని ఆమె అన్నారు.
News November 20, 2025
SA-1 ఫలితాలపై సమీక్ష, హాజరు పెంచాలని కలెక్టర్ ఆదేశాలు

NRPTజిల్లాలోని ఉన్నత పాఠశాలల 10వ తరగతి పరీక్షా తయారీ, SA-1ఫలితాలపై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష నిర్వహించారు. పాఠశాల వారీగా విద్యార్థుల ప్రగతి, బోధన ప్రమాణాలు, ఫలితాల్లో వచ్చిన లోపాలపై వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి, పాఠశాలకు రప్పించే చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.
News November 20, 2025
హైదరాబాద్ ఇమేజ్ను పెంచిన KTR: సబిత

BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపునకు దిగిందని మాజీ మంత్రి, మహేశ్వరం MLA సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. ప్రతి పక్షాన్ని, ప్రశ్నించే గొంతులను నొక్కేసే ప్రయత్నం CM రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. పూర్తి పారదర్శకతతో ఫార్ములా-ఈ రేసులను నిర్వహించి హైదరాబాద్ ఇమేజ్ను పెంచిన KTRపై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికమని ఆమె అన్నారు.


