News February 7, 2025

10న శ్రీశైలానికి మంత్రులు

image

శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 23న సీఎం చంద్రబాబు శ్రీశైలానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న పలువురు మంత్రులు క్షేత్రానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించనున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణరెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, అనిత, అనగాని సత్యప్రసాద్, అలాగే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా ఏర్పాట్లు పరిశీలిస్తారు.

Similar News

News December 3, 2025

తులసి కోట వద్ద నిత్య దీపారాధన ఎందుకు చేయాలి?

image

తులసి కోట వద్ద నిత్యం దీపం వెలిగించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా ఇంటి నిండా సానుకూల శక్తి ప్రవహిస్తుందని చెబుతున్నారు. ఈ దీపం మన పరిసరాలను శుద్ధి చేసి మనలో పాజిటివ్ ఆలోచనలు కలిగేలా చేస్తుందని అంటున్నారు. ‘లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. కుటుంబ సభ్యులందరూ ప్రశాంతంగా ఉంటారు. సంపద, శ్రేయస్సు, అదృష్టం పెరిగే యోగం కూడా ఉంటుంది’ అని వివరిస్తున్నారు.

News December 3, 2025

స్మృతి మంధాన పెళ్లి కొత్త డేట్ ఇదేనా?

image

స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో తొలుత స్మృతి తండ్రి, ఆపై పలాశ్ ఆస్పత్రుల్లో చేరి డిశ్ఛార్జ్ అయ్యారు. కాగా పెళ్లికి కొత్త డేట్ ఫిక్స్ అయిందని, DEC 7న వివాహం జరగనుందని SMలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్మృతి బ్రదర్ శ్రవణ్ స్పందిస్తూ.. ‘ప్రస్తుతానికి పెళ్లి వాయిదా పడింది. కొత్త డేట్ గురించి మేము ప్రకటించలేదు. ప్రచారంలో ఉన్న డేట్ రూమర్ మాత్రమే’ అని చెప్పారు.

News December 3, 2025

సరికొత్త ఆవిష్కరణలకు పట్టం కట్టాలి: పవన్

image

AP: సరికొత్త ఆవిష్కరణలకు పట్టం కట్టాలని, ఆవిష్కర్తలను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని Dy.CM పవన్ అన్నారు. అవసరమైతే MSME పార్కుల్లో వీరికి ప్రాధాన్యత ఇచ్చే అంశంపై CMతో చర్చిస్తామని శాస్త్ర, సాంకేతిక శాఖ సమీక్షలో తెలిపారు. ‘అవసరాలకు తగినట్లు మనమే వస్తువులు తయారు చేసుకోవాలి. మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా లక్ష్యం అదే. దిగుమతుల మీద ఆధారపడడం తగ్గిస్తే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది’ అని చెప్పారు.