News March 29, 2024

10రోజుల కిందే కూతురు పెళ్లి.. అంతలోనే పెనువిషాదం

image

కుటుంబ కలహాలు ఓ ఇంట విషాదాన్ని నింపాయి. ఉండ్రాజవరానికి చెందిన వెంకట్(40)- పార్వతికి 20ఏళ్ల కింద పెళ్లైంది. కొడుకు, కుమార్తె సంతానం. గొడవలతో దూరంగా ఉంటున్న వీరిద్దరూ 10రోజుల కిందే కుమార్తె పెళ్లి చేశారు. రెండ్రోజుల కింద వెంకట్.. తాడేపల్లిగూడెంలోని పార్వతి ఇంటికి రాగా గొడవ జరిగింది. వెంకట్ కత్తితో కొడుకును పొడవగా.. పార్వతి భర్త తలపై ఇటుకతో కొట్టింది. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. వెంకట్ మరణించాడు.

Similar News

News November 25, 2025

24 గంటల్లో ధాన్యం చెల్లింపులు తప్పనిసరి: మంత్రి నాదెండ్ల

image

రాజమండ్రి కలెక్టరేట్‌లో ఖరీఫ్ ధాన్యం సేకరణపై మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ అధ్యక్షతన సమీక్ష జరిగింది. ధాన్యం కొనుగోలు చేసిన 24గంటల్లోపు రైతులకు చెల్లింపులు చేయాలని మంత్రి మనోహర్ ఆదేశించారు. ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులే వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖ పనితీరు మెరుగుపడాలని సూచించారు.

News November 25, 2025

24 గంటల్లో ధాన్యం చెల్లింపులు తప్పనిసరి: మంత్రి నాదెండ్ల

image

రాజమండ్రి కలెక్టరేట్‌లో ఖరీఫ్ ధాన్యం సేకరణపై మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ అధ్యక్షతన సమీక్ష జరిగింది. ధాన్యం కొనుగోలు చేసిన 24గంటల్లోపు రైతులకు చెల్లింపులు చేయాలని మంత్రి మనోహర్ ఆదేశించారు. ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులే వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖ పనితీరు మెరుగుపడాలని సూచించారు.

News November 24, 2025

టెన్త్ పరీక్షల‌పై సందేహాలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్: DEO

image

2026 మార్చి 16 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి నామినల్ రోల్స్‌ను ప్రధానోపాధ్యాయులు నిశితంగా పరిశీలించాలని డీఈవో కంది వాసుదేవరావు సూచించారు. పాఠశాల యూ-డైస్‌ డేటాతో సరిచూసుకుని, దోషరహితంగా ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలన్నారు. ఏమైనా సందేహాలుంటే నివృత్తి కోసం జిల్లాస్థాయి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని, అసిస్టెంట్ కమిషనర్ ఎం.అమలకుమారిని 9849939487 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.