News February 17, 2025

10వ తరగతి పరీక్షలపై డివిజన్ స్థాయిలో సమీక్ష

image

10వ తరగతి పరీక్షలపై 19, 20 తేదీల్లో డివిజన్ స్థాయిలో సమీక్ష నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి నెలలో జరగనున్న 10వ తరగతి పరీక్షలపై 19 వ తేదీన కందుకూరు, కావలి డివిజన్లకు, 20వ తేదీన నెల్లూరు, ఆత్మకూరు డివిజన్లకు ఆయా ప్రాంతాల్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి డిపార్ట్మెంటల్‌, చీఫ్ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

Similar News

News March 25, 2025

48 గంటల్లోగా నగదు జమ: నెల్లూరు జేసీ

image

జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 40,285.32 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం 3336.72 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జేసీ వెల్లడించారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ 24 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

News March 24, 2025

నెల్లూరు: పోలీస్ గ్రీవెన్స్‌కి 86 ఫిర్యాదులు

image

నెల్లూరు జిల్లా ఎస్పీ యస్. కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు ఉమేశ్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఏఎస్పీ సౌజన్య నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వివిధ సమస్యలపైన వినతులను అధికారులకి అందచేశారు. పరిష్కార వేదికకు మొత్తం 86 ఫిర్యాదులు వచ్చాయని ఏఎస్పీ తెలిపారు.

News March 24, 2025

76 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.143 కోట్లు: ఆనం

image

రాష్ట్రంలో 76 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.143 కోట్లు మంజూరు అయ్యాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని మూలాపేట వేణుగోపాలస్వామి దేవస్థానంలో ఆలయ పాలకమండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వంశపారంపర్యంగా ఆలయ ధర్మకర్తలుగా పని చేస్తున్నామన్నారు. వేణుగోపాల స్వామి దేవాలయంలో పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

error: Content is protected !!