News March 17, 2025
10వ తరగతి పరీక్షలు నిర్వహణకు 21 పరీక్షా కేంద్రాలు: కలెక్టర్

ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో ఈనెల 21 నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో పరీక్షలు నిర్వహణకు 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 3449 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News January 5, 2026
రాశీకి క్షమాపణలు చెప్పిన అనసూయ

సీనియర్ హీరోయిన్ <<18762425>>రాశీకి<<>> నటి అనసూయ క్షమాపణలు చెప్పారు. మూడేళ్ల క్రితం ఓ షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్లో తనతో డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారని Xలో పోస్ట్ చేశారు. ఆ వ్యాఖ్యలు రాయించి, డైరెక్ట్ చేసిన వ్యక్తిని ఆ రోజునే నిలదీయాల్సి ఉండగా ఆ టైమ్కి తన శక్తి సరిపోలేదన్నారు. మనుషులు మారుతారని, ఆ షో విడిచి పెట్టాక తనలో మార్పును గమనించాలని కోరారు. గతంతో పోలిస్తే తాను శక్తిమంతంగా మారానన్నారు.
News January 5, 2026
ఈనెల 7న సంగారెడ్డిలో ఉద్యోగ మేళా

ఈనెల 7న సంగారెడ్డిలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పి.అనిల్ కుమార్ తెలిపారు. అపోలో ఫార్మసీలో 100 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి 18- 35 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు అర్హులు. ఆసక్తి గలవారు బుధవారం ఉ. 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా ఉపాధి కార్యాలయ ప్రాంగణంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు.
News January 5, 2026
ఏంటీ ‘ట్రంపరితనం’.. కొత్త యుద్ధాలు తప్పవా?

వెనిజులా అధ్యక్షుడు మదురోను ట్రంప్ అరెస్టు చేయడం, <<18765231>>గ్రీన్ల్యాండ్పైనా<<>> కన్నేయడం భయాందోళనలకు దారితీస్తోంది. తాను 8 యుద్ధాలను ఆపానని, శాంతిదూతనని గొప్పలు చెప్పుకునే ట్రంప్ తెంపరి చేష్టలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి చర్యలు చిన్న దేశాల మనుగడకు ప్రమాదకరమని, చైనా, రష్యా, ఉ.కొరియా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు మరింత విజృంభిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. 2026లోనూ కొత్త యుద్ధాలకు ఆస్కారం ఉందంటున్నారు.


