News March 17, 2025
10వ తరగతి పరీక్షలు నిర్వహణకు 21 పరీక్షా కేంద్రాలు: కలెక్టర్

ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో ఈనెల 21 నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో పరీక్షలు నిర్వహణకు 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 3449 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News September 16, 2025
సంగారెడ్డి: పాఠశాలల పర్యవేక్షణకు అధికారుల నియామకం

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి అధికారులను నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లాకు రమణ కుమార్ను నియమించారని పేర్కొన్నారు. వీరు జిల్లాలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించనున్నారని తెలిపారు.
News September 16, 2025
‘షేక్ హ్యాండ్’ వివాదంలో పాక్కు మరో ఎదురుదెబ్బ!

ఆసియా కప్: పాక్ ప్లేయర్లకు సూర్య స్క్వాడ్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదన్న విషయం తెలిసిందే. అది నిబంధనలకు విరుద్ధమని ICCకి PCB ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్ను తొలగించాలని, లేకపోతే UAEతో మ్యాచ్ ఆడమని పాక్ బెదిరించింది. పాక్ బెదిరింపులను ICC తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ‘అందులో మ్యాచ్ రిఫరీ పాత్ర లేదని, షేక్హ్యాండ్ ఇవ్వాలని MCC మాన్యువల్లో లేదు’ అని ICC తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.
News September 16, 2025
హాస్టళ్ల నిర్మాణం-మరమ్మతులకు నిధులు: CBN

AP: SC, ST, BC హాస్టళ్లలో వసతులు మెరుగవ్వాలని CM చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు కేంద్రం నుంచి పావలా వడ్డీ కింద రుణం వస్తుంది. ఆ వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేలా విధానాలను రూపొందించండి. సంక్షేమ హాస్టళ్ల పునర్నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేయండి. SC, ST హాస్టళ్లలో చదివే విద్యార్థులు IIT, IIM వంటి సంస్థల్లో సీట్లు సాధించేలా మరింత కృషి చేయాలి’ అని తెలిపారు.