News March 20, 2025

10వ తరగతి పరీక్షలు పక్కడ్బందీగా నిర్వహించాలి: వరంగల్ కలెక్టర్

image

ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పక్కడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై బుధవారం సమీక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలన్నారు.

Similar News

News October 30, 2025

కృష్ణా: తుపాన్ బాధితులకు సాయం.. ఏమేమి ఇస్తున్నారంటే.!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొంథా తుపాను బాధితులు, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, వీవర్స్ కుటుంబాలకు ఆర్థిక సాయం, నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు. పునరావాస కేంద్రాలలో ఒక్కరికి రూ. 1000 నుంచి రూ.3వేల వరకు నగదు, 50 కేజీల బియ్యం, పప్పు, పంచదార, కూరగాయలు వంటి నిత్యావసరాలను నేడు అందజేయనున్నారు. NTRలో 485 కుటుంబాలు, మత్స్యకారులకు చెందిన 1,488, కృష్ణాలో 35-37వేల కుటుంబాలను ఆర్థిక సాయం కోసం ఎంపిక చేశారు.

News October 30, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. వేడి చేసిన నీటినే తాగండి

image

తెలుగు రాష్ట్రాల్లో ‘మొంథా’ తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో వర్షాలు, వరద ప్రభావిత ప్రాంత ప్రజలు వేడి చేసిన నీటినే తాగాలని అధికారులు సూచించారు. తద్వారా వ్యాధుల ముప్పు నుంచి బయటపడొచ్చని చెప్పారు. ఈ సమయంలో జ్వరం బారిన పడితే నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను సంప్రదించాలని తెలిపారు. మరోవైపు కొన్ని చోట్ల అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు.

News October 30, 2025

హీరో నారా రోహిత్ భార్య పల్నాడు వారే.!

image

హీరో నారా రోహిత్ వివాహానికి సీఎం చంద్రబాబు గురువారం హాజరుకానున్నారు. నారా రోహిత్ భార్య శిరీష లెల్ల పల్నాడు జిల్లాలోని రెంటచింతల గ్రామానికి చెందినవారు. ఆమెది ఒక సాధారణ రైతు కుటుంబం. సినిమా రంగంపై ఆసక్తితో ఆమె హైదరాబాద్‌కు వచ్చి, ఆడిషన్స్‌లో పాల్గొని, ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. వీరిద్దరూ పరస్పరం ఇష్టపడడంతో శిరీషను అదృష్టం వరించింది.