News March 20, 2025

10వ తరగతి పరీక్షలు పక్కడ్బందీగా నిర్వహించాలి: వరంగల్ కలెక్టర్

image

ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పక్కడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై బుధవారం సమీక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలన్నారు.

Similar News

News December 4, 2025

సంక్రాంతి నుంచి ప్రభుత్వ హాస్టళ్లల్లో చేపల కూర!

image

TG: ప్రభుత్వ హాస్టళ్లు, క్రీడా పాఠశాలల్లోని విద్యార్థులకు చేపల కూర వడ్డించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సంక్రాంతి తర్వాత ఈ పథకం అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. మత్స్యశాఖ ఇప్పటికే సుమారు 50 కోట్ల చేపపిల్లలను చెరువుల్లో వదిలింది. చేపల ఉత్పత్తి పెరిగితే విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే సర్కారు ప్రణాళికలను సిద్ధం చేసింది.

News December 4, 2025

‘శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాల జాబితా సిద్ధం చేయాలి’

image

జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాల జాబితాను వారం రోజుల్లో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దేవాదాయ శాఖ ఈఓలను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ బంగ్లాలో సమావేశం సంబంధిత అధికారులతో నిర్వహించారు. ఒక్కొక్క దేవాదాయ శాఖ ఈఓ పరిధిలో ఉన్న పుణ్యక్షేత్రాలు ఎన్ని ఉన్నాయి, వాటి చరిత్ర, పురాతనం నుంచి వస్తున్న జాతర చరిత్రలను సిద్ధం చేసి వారం రోజుల్లో జాబితా అందజేయాలన్నారు.

News December 4, 2025

WGL: బాల కార్మికత్వ నిర్మూలనకు పోలీసుల ప్రత్యేక ప్రచారం

image

బాల కార్మికత్వ నిర్మూలనకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు ‘సే నో టు చైల్డ్‌ లేబర్‌ – ఎస్ టు ఎడ్యుకేషన్‌’ అనే శీర్షికతో అవగాహన పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న చిన్నారి, చదువుకుంటున్న విద్యార్థుల దృశ్యాలను పోస్టర్‌లో చూపిస్తూ – ‘పని కాదు, విద్యే పిల్లల హక్కు’ అని పిలుపునిచ్చింది. బాల కార్మికుల సమస్యను గుర్తించి స్పందించాలని కోరింది.