News March 17, 2025

10వ తరగతి పరీక్షలు నిర్వహణకు 21 పరీక్షా కేంద్రాలు: కలెక్టర్

image

ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో ఈనెల 21 నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో పరీక్షలు నిర్వహణకు 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 3449 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.

Similar News

News January 7, 2026

జిల్లాల పునర్విభజన: ఓరుగల్లులో మళ్లీ హాట్ టాపిక్!

image

జిల్లాల విభజన అంశం మళ్లీ తెరపైకి రావడంతో వరంగల్ వాసుల్లో ఉత్కంఠ పెరిగింది. గత ప్రభుత్వం ఉమ్మడి వరంగల్‌ను 6 జిల్లాలుగా విభజించిందన్న విమర్శల నేపథ్యంలో, ప్రభుత్వం శాసనసభలో పునర్విభజన ప్రకటన చేయడం కొత్త చర్చకు దారితీసింది. వరంగల్-హనుమకొండ విలీనంపై స్పష్టత వస్తుందా? ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల పరిధులు ఎలా మారతాయి? అనే ఆసక్తి నెలకొంది. సరిహద్దులు మారకుండా చూసే అవకాశం ఉందో చూడాల్సి ఉంది.

News January 7, 2026

దేశంలోనే తొలి ‘హైడ్రోజన్ ట్రైన్’ సిద్ధం

image

భారత రైల్వే చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. హరియాణాలోని జింద్-సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల మేర దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు త్వరలో ప్రారంభం కానుంది. ఇందుకోసం జింద్‌లో దేశంలోనే అతిపెద్ద హైడ్రోజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ రైలు కేవలం నీటి ఆవిరి, వేడిని మాత్రమే విడుదల చేస్తుంది కాబట్టి పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం ప్లాంట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

News January 7, 2026

సంగారెడ్డి: ఆలస్య రుసుంతో 27 వరకు గడువు

image

ఆలస్య రుసుంతో ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తత్కాల్‌ పథకం కింద రూ.వెయ్యితో చెల్లించుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.