News June 4, 2024
10 నుంచి డిగ్రీ సెమిస్టర్ తరగతులు ప్రారంభం

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఆర్ట్స్& సైన్స్ కళాశాలలో ఈ నెల 10 నుంచి డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ 3వ, 5వ సెమిస్టర్ల ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు. కావున విద్యార్థులు తప్పక ప్రత్యక్ష తరగతులకు హాజరవ్వాలన్నారు. తరగతులకు హాజరు కాని విద్యార్థులను సెమిస్టర్ పరీక్షలకు అనుమతించబోమని ఆమె తెలిపారు.
Similar News
News February 25, 2026
వరంగల్: రాయితీలపై పనిముట్లు అందజేత

ఉద్యాన రైతులకు సబ్సిడీలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కూరగాయ విత్తన కిట్లు 100% సబ్సిడీతో పాటు మినీ ట్రాక్టర్లు, పవర్ స్ప్రేయర్లు, మామిడి ఫ్రూట్ కవర్లు, మల్చింగ్ షీట్లు, ప్లాస్టిక్ క్రేట్లు, లూజ్ షేడ్నెట్లపై 40–50% రాయితీ అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు, మహిళా రైతులకు ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తుకు మార్చి 15 చివరి తేదీ. ఆసక్తి గల రైతులు ఉద్యానవన అధికారులను సంప్రదించాలి.
News February 25, 2026
వరంగల్: రాయితీలపై పనిముట్లు అందజేత

ఉద్యాన రైతులకు సబ్సిడీలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కూరగాయ విత్తన కిట్లు 100% సబ్సిడీతో పాటు మినీ ట్రాక్టర్లు, పవర్ స్ప్రేయర్లు, మామిడి ఫ్రూట్ కవర్లు, మల్చింగ్ షీట్లు, ప్లాస్టిక్ క్రేట్లు, లూజ్ షేడ్నెట్లపై 40–50% రాయితీ అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు, మహిళా రైతులకు ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తుకు మార్చి 15 చివరి తేదీ. ఆసక్తి గల రైతులు ఉద్యానవన అధికారులను సంప్రదించాలి.
News February 24, 2026
వరంగల్ జిల్లాలో పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

జిల్లాలో నిర్వహించబోయే ఇంటర్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ పరీక్షా ఏర్పాట్ల వివరాలను తెలిపారు.


