News February 26, 2025
10 రోజుల్లో పెళ్లి.. మహిళా కానిస్టేబుల్ సూసైడ్

భువనగిరిలో మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. కుటుంబసబ్యులు ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనూషకు ఈ నెల 14న నిశ్చితార్థం జరగ్గా, వచ్చే నెల 6న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు.ఈ క్రమంలో అనూష తను అద్దెకు ఉంటున్న ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని సహోద్యోగులకు చెప్పినట్లు తెలుస్తోంది.
Similar News
News February 26, 2025
నల్గొండ: పోలింగ్ సెంటర్లకు తరలిన సిబ్బంది

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ నిర్వహణకు పోలింగ్ సిబ్బంది నల్గొండ నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలారు. బుధవారం నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్నికల సామాగ్రిని అధికారులు పోలింగ్ సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఎన్నికల సామాగ్రితో సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రూట్ బస్సులలో బయలుదేరారు.
News February 26, 2025
నల్గొండ: గుండెపోటుతో వ్యక్తి మృతి

చండూరు మండలం నెర్మటలో పండుగ పూట తీవ్ర విషాదం జరిగింది. గుండెపోటుతో దోటి లింగయ్య (45) అనే వ్యక్తి మృతిచెందాడు. ఉదయం పొలం దగ్గరకు వెళ్లొచ్చాడని అంతలోనే ఛాతిలో నొప్పు వస్తుందని కుప్పకూలాడని గ్రామస్థులు తెలిపారు. లింగయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News February 26, 2025
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దు: డీఎంహెచ్వో

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని డీఎంహెచ్ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. NLG డీఎంహెచ్ఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నిషియన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజూ పీహెచ్సీలకు వచ్చే రోగుల రక్తనమూనాలు సేకరించి తెలంగాణ హబ్కు పంపాలన్నారు.