News February 7, 2026
10 ఏళ్లలో చేయని అభివృద్ధి రెండేళ్లలో చేసి చూపించాం: వీహెచ్

బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో చేయని అభివృద్ధిని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో చేసి చూపించామని రాజ్యసభ మాజీ సభ్యుడు వీ.హనుమంతరావు అన్నారు. వేములవాడ గాంధీనగర్లో శనివారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం వేములవాడను శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారని, మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.
Similar News
News February 12, 2026
మాజీ సీఎంసంజీవయ్య జన్మదిన వేడుకలను జయప్రదం చేయండి: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో ఈ నెల 14న ఏపీ తొలి దళిత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 14న ఉదయం 10:30 గంటలకు రెవెన్యూ భవన్లో కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాలకు జిల్లా అధికారులు, దళిత నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం కలెక్టర్ పిలుపునిచ్చారు.
News February 12, 2026
బాల భీముడు.. 5.20KGల బరువుతో జననం

TG: సాధారణంగా నవజాత శిశువులు పుట్టగానే 2.5-3.5 కిలోల బరువుంటారు. కొన్నిచోట్ల 4 కేజీల బరువుతోనూ జన్మించారు. అయితే భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో సంధ్యారాణి అనే మహిళ సీ సెక్షన్ ద్వారా 5.20 కేజీల బరువున్న మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఈ బాల భీముడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
News February 12, 2026
సేంద్రియ సాగుతోనే ‘డబుల్ ధమాకా’: కలెక్టర్

సేంద్రియ సాగుతోనే రైతులకు రెట్టింపు లాభాలు చేకూరుతాయని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. గురువారం రెడ్డిగూడెం మండలం రంగాపురంలో ఆర్డీఓ మాధురితో కలిసి ఆయన మామిడి తోటలను సందర్శించారు. క్షేత్రస్థాయిలో సాగు పద్ధతులను పరిశీలించి, స్వయంగా మామిడి కాయలకు ఫ్రూట్ కవర్లు కట్టారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల (FPO) ప్రతినిధులతో మాట్లాడి, నాణ్యమైన దిగుబడి కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు.


