News June 4, 2024

10 నుంచి డిగ్రీ సెమిస్టర్ తరగతులు ప్రారంభం

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఆర్ట్స్& సైన్స్ కళాశాలలో ఈ నెల 10 నుంచి డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ 3వ, 5వ సెమిస్టర్‌ల ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు. కావున విద్యార్థులు తప్పక ప్రత్యక్ష తరగతులకు హాజరవ్వాలన్నారు. తరగతులకు హాజరు కాని విద్యార్థులను సెమిస్టర్ పరీక్షలకు అనుమతించబోమని ఆమె తెలిపారు.

Similar News

News November 2, 2025

గీసుకొండ: ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

image

గీసుకొండ మండలం మొగిలిచర్లలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక అప్ప నాగరాజు (34) అనే ఆటో డ్రైవర్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కుటుంబ పరిస్థితులు దిగజారడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

News November 2, 2025

సంగెం: గుంతలో పడి వృద్ధుడి మృతి

image

సంగెం మండలం లోహిత గ్రామంలోని నల్లాల గేట్‌వాల్ సమీపంలో ఉన్న గుంతలో పడి గుర్తు తెలియని వృద్ధుడు (సుమారు 60 ఏళ్లు) మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి గుర్తింపు కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

News November 2, 2025

వరంగల్: కబ్జాలతో కష్టాలు

image

వరంగల్ నగరాన్ని వరద ముంచెత్తింది. దీనికి ప్రధాన కారణం వర్షం కాదని, నాలాలు, కాలువలు, చెరువులపై జరుగుతున్న ఆక్రమణలేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు నగరానికి అందాన్ని తెచ్చిన 170కి పైగా చెరువులు, కుంటలు ఇప్పుడు అర్ధభాగం వరకు మాయం అయ్యాయని, మురికి కాలువలపై కొందరు అక్రమార్కులు భవనాలు, షాపులు నిర్మించుకుని ప్రజా భద్రతను సవాల్ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.