News June 4, 2024
10 నుంచి డిగ్రీ సెమిస్టర్ తరగతులు ప్రారంభం

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఆర్ట్స్& సైన్స్ కళాశాలలో ఈ నెల 10 నుంచి డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ 3వ, 5వ సెమిస్టర్ల ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు. కావున విద్యార్థులు తప్పక ప్రత్యక్ష తరగతులకు హాజరవ్వాలన్నారు. తరగతులకు హాజరు కాని విద్యార్థులను సెమిస్టర్ పరీక్షలకు అనుమతించబోమని ఆమె తెలిపారు.
Similar News
News December 21, 2025
జాతీయ కరాటే పోటీల్లో వర్ధన్నపేట బాలుడికి స్వర్ణం

భోపాల్లో నిర్వహించిన 16వ నేషనల్ WFSKO ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్-2025లో వర్ధన్నపేట పట్టణానికి చెందిన ఎం.మహాజన్ ఉపేంద్ర బంగారు పతకం సాధించాడు. పుస్కోస్ పాఠశాలలో చదువుతున్న ఉపేంద్ర, 10 ఏళ్ల లోపు బాలుర విభాగంలో దేశవ్యాప్తంగా వచ్చిన వందలాది మంది క్రీడాకారులతో తలపడి అద్భుత నైపుణ్యంతో ఈ విజయాన్ని అందుకున్నాడు. జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించిన ఉపేంద్రను పాఠశాల యాజమాన్యం అభినందించింది.
News December 21, 2025
వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు

వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఆదివారం చికెన్ విత్ స్కిన్ KG రూ.240 నుంచి రూ.260 పలకగా స్కిన్ లెస్ KG రూ.260-రూ.280గా ఉంది. అలాగే లైవ్ కోడి రూ.170-రూ.180 పలుకుతోంది. సిటీతో పోలిస్తే పల్లెటూరులో రూ.10-20 ధర వ్యత్యాసం ఉంది.
News December 21, 2025
WGL: భద్రకాళి అమ్మవారి నేటి దర్శనం

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో ఆదివారం ఆలయ అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు చేశారు. ఆదివారం సెలవు కావడంతో భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.


