News August 7, 2024

50వేలమంది ఉద్యోగులకు 10రోజుల ‘వెకేషన్’!

image

గుజరాత్‌కు చెందిన కిరణ్ జెమ్స్ కంపెనీ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. సంస్థలోని 50వేలమందికి ఈ నెల 17 నుంచి 27 వరకు 10 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వజ్రాలకు గిరాకీ తగ్గిందని, ఉత్పత్తిని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని యజమాని వల్లభ్‌భాయ్ లఖానీ తెలిపారు. సహజ వజ్రాల ఉత్పత్తిదారుల్లో తమదే అతి పెద్ద సంస్థ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News January 30, 2026

హార్వర్డ్‌లో కోర్స్ పూర్తి చేసుకున్న CM రేవంత్

image

హార్వర్డ్ కెనడీ స్కూల్‌లో TG CM రేవంత్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తయింది. ‘లీడర్‌షిప్ ఇన్ ది 21st సెంచరీ’ అనే ప్రోగ్రామ్‌ని JAN 25 నుంచి నిర్వహించారు. CM సహా 62 మంది విద్యార్థులు ఈ కోర్సు పూర్తి చేశారు. వారికి కెనడీ స్కూల్ ఫ్యాకల్టీ సర్టిఫికెట్స్ అందజేశారు. రోజూ ఉ.7 గంటల నుంచి సా.6 గంటల వరకు ఈ ప్రోగ్రామ్‌ని నిర్వహించారు.

News January 30, 2026

ఒక్క రోజే రూ.10వేలు తగ్గిన కేజీ వెండి ధర

image

వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న వెండి ధర ఇవాళ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో KG సిల్వర్ రేటు రూ.10వేలు పతనమై రూ.4,15,000కు చేరింది. కాగా నిన్న ఒక్క రోజే కేజీ వెండి ధర రూ.25వేలు పెరిగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. అటు బంగారం ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి.

News January 30, 2026

NCERTలో 173 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

image

<>NCERT<<>>లో 173 గ్రూప్ A, B, C నాన్ అకడమిక్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ కాగా.. ఫిబ్రవరి 2వరకు పొడిగించారు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in