News March 26, 2024
శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

AP: తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 78371 మంది భక్తులు దర్శించుకోగా 25156 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.4 కోట్లు లభించింది.
Similar News
News February 20, 2026
మాజీ CM జగన్తో బ్రహ్మానందం ముచ్చట్లు

AP: గన్నవరం ఎయిర్పోర్టులో మాజీ CM YS జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం మర్యాదపూర్వకంగా కలిశారు. విమానాశ్రయం లాంజ్లో వీరిద్దరూ కాసేపు ముచ్చటించారు. ఒకరినొకరు క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పొలిటికల్ స్టార్, కామెడీ స్టార్ ఒకే ఫ్రేమ్లో అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
News February 20, 2026
దేవుడంటే వైసీపీకి గౌరవం లేదు: పయ్యావుల

AP: దేవుడి పట్ల వైసీపీకి ఏమాత్రం గౌరవం లేదని ఇవాళ్టి చర్యలతో నిరూపితమైందని మంత్రి పయ్యావుల కేశవ్ ఫైరయ్యారు. సభలోకి దేవుడి <<19190397>>ఫొటోలు<<>> తీసుకురావడంపై సహచర మంత్రులతో కలిసి మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు ఫిర్యాదు చేశారు. వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రెచ్చగొట్టే చర్యలతో సభను అడ్డుకోవాలని చూస్తే ఏమనుకోవాలని ప్రశ్నించారు. ప్లకార్డులో వెంకన్న ఫొటో వాడి చెప్పులతో ర్యాలీ చేస్తారా? అని నిలదీశారు.
News February 20, 2026
ఫోన్పేలో బయోమెట్రిక్.. ఇలా యాక్టివేట్ చేసుకోండి

రూ.5వేల లోపు ట్రాన్సాక్షన్ల కోసం ఫోన్పే <<19185907>>బయోమెట్రిక్<<>> ఫీచర్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని యాక్టివేట్ చేయాలంటే ఫోన్పే యాప్లో ఎడమ వైపు కార్నర్లో ఉండే ప్రొఫైల్ ఓపెన్ చేయాలి. అందులో మేనేజ్ పేమెంట్స్పై క్లిక్ చేస్తే కింద Biometric Pay కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి పిన్ ఎంటర్ చేస్తే చాలు. ఇందుకోసం ప్లేస్టోర్లో యాప్ అప్డేట్ చేసుకోవాలి. ఈ ఫీచర్ iOS యూజర్లకు అందుబాటులో లేదు.


