News November 25, 2024
శ్రీవారి దర్శనానికి 10 గంటల టైమ్

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఏడుకొండలవాడిని నిన్న 75,147 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,096 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.16 కోట్లు లభించింది.
Similar News
News December 13, 2025
రేపు రెండో విడత పోలింగ్

TG: పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ రేపు జరగనుంది. 4,332 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 5చోట్ల ఎవరూ నామినేషన్లు వేయలేదు. 415 గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవం కాగా మిగతా సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అటు 29,903వార్డు స్థానాలకూ ఓటింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ కోసం పాఠశాలలు ఉపయోగిస్తుండటంతో నేటి నుంచే ఏర్పాట్లు చేయనున్నారు. దీంతో ఇవాళ, రేపు(సండే) ఆయా స్కూళ్లకు సెలవు ఇచ్చారు.
News December 13, 2025
చేపల చెరువుల్లో నీటి పీహెచ్ స్థాయి ఎంత ఉండాలి?

☛ చేపలు ఎక్కువగా పీహెచ్ స్థాయి 7.0-8.5 మధ్య ఉన్న చెరువు నీటిలో బాగా పెరుగుతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 6.5 కన్నా తక్కువైతే (ఆమ్ల ధర్మం గల నీరు) చేపలు బలహీనమై, వ్యాధుల బారినపడతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 9 కన్నా ఎక్కువైతే (క్షార ధర్మం గల నీరు) చేపల మొప్పలు దెబ్బతిని, ప్రాణ వాయువుని గ్రహించే శక్తి చేపల్లో తగ్గుతుంది. అందుకే నీటి పీహెచ్ స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.
News December 13, 2025
గుమ్మడి దీపం పెడుతూ పఠించాల్సిన శ్లోకం..

కూష్మాండో బలిరూపేణ మమ భాగ్యాదవస్థితాః
ప్రణమామి తతస్సర్వ రూపిణం బలి రూపిణం
‘నేను బూడిద గుమ్మడికాయను బలిగా సమర్పిస్తున్నాను. ఫలితంగా నా జీవితంలో అదృష్టం, శుభం స్థిరంగా ఉంటాయి. ఈ బలి రూపాన్ని ధరించిన దైవ శక్తికి, అలాగే ఎన్నో రూపాల్లో ఉన్న ఆ శక్తికి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను’ అని చెప్పి కూష్మాండ దీపం వెలిగించాలి. తద్వారా ఆర్థిక, గ్రహ, కుటుంబ సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని నమ్మకం.


