News November 25, 2024

శ్రీవారి దర్శనానికి 10 గంటల టైమ్

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఏడుకొండలవాడిని నిన్న 75,147 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,096 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.16 కోట్లు లభించింది.

Similar News

News November 17, 2025

ఇవాళ ఈ మంత్రం జపిస్తే ‘అకాల మృత్యు భయం’ తొలగుతుంది!

image

కార్తీక సోమవారాలు శివారాధనకు అత్యంత ముఖ్యమైనవి. చివరి వారమైన ఈ రోజు ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే శుభకరమని పండితులు చెబుతున్నారు. మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే శివానుగ్రహం లభించి, అకాల మృత్యు భయం తొలగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నిష్ఠతో జపిస్తే శివుడు ఎల్లప్పుడూ కాపాడుతారని ప్రతీతి.
*‘ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం | ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్’*

News November 17, 2025

రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాలపై 500% టారిఫ్!

image

రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాల కట్టడికి అమెరికా సెనేట్ కొత్త బిల్లు తెచ్చింది. అలాంటి దేశాలపై 500% టారిఫ్ విధించేలా తెచ్చే బిల్లును సెనేటర్ లిండ్సే ప్రతిపాదించారు. దీనికి ప్రెసిడెంట్ ట్రంప్ మద్దతిచ్చారు. దీంతో భారత్, చైనా లాంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించినట్లు సమాచారం.

News November 17, 2025

సౌదీ బస్సు ప్రమాదం.. మృతుల వివరాలపై ఇంకా రాని స్పష్టత!

image

సౌదీ బస్సు <<18308554>>ప్రమాదంలో<<>> HYD వాసులు చనిపోయినట్లు వార్తలు రావడంతో యాత్రికుల బంధువులు ట్రావెల్ ఏజెన్సీల వద్దకు చేరుకుంటున్నారు. మల్లేపల్లిలోని అల్ మీనా ట్రావెల్స్ ద్వారా అసిఫ్‌నగర్ జిర్ర ప్రాంతం నుంచి 16మంది, మెహిదీపట్నం ఫ్లైజోన్ ట్రావెల్స్ ద్వారా 24మంది, మరో ఏజెన్సీ నుంచి ఇద్దరు సౌదీ వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై MP అసద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నామన్నారు.