News September 27, 2024

తొలి దశలో 10 లక్షల ఇందిరమ్మ ఇళ్లు

image

TG: రాష్ట్రంలో తొలి దశలో భాగంగా 10 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తుందని సమాచారం. పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్త, రెవెన్యూ సిబ్బందితో కలిపి గ్రామ కమిటీ వేయనుంది. మొదటి దశలో సొంత స్థలం ఉన్నవారికి, రెండో దశలో స్థలం లేనివారికి ఇవ్వనుంది.

Similar News

News September 27, 2024

IPL అభిమానులకు బ్యాడ్ న్యూస్?

image

IPL-2025లో మ్యాచ్‌ల సంఖ్యను 84కు పెంచేది లేదని BCCI తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. గతంలో మాదిరి 74 మ్యాచ్‌లే ఆడించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆటగాళ్లపై అదనపు ఒత్తిడి లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. కాగా వచ్చే సీజన్‌లో 84 మ్యాచ్‌లు ఆడించాలని గతంలో BCCI యోచించింది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

News September 27, 2024

జగన్ తిరుపతి పర్యటన.. కూటమి కీలక నిర్ణయం

image

AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈరోజు తిరుపతిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి నేతలు సమావేశమయ్యారు. జగన్ పర్యటనను అడ్డుకోవద్దని నిర్ణయించారు. అయితే లడ్డూ కల్తీకి కారణం జగనే అని, ఆయన వెళ్లే దారిలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

News September 27, 2024

చరిత్ర సృష్టించేందుకు 35 పరుగులు కావాలి!

image

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అరుదైన జాబితాలో చేరనున్నారు. 534 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 26,965 పరుగులు చేశారు. మరో 35 చేస్తే అత్యంత వేగంగా 27వేల రన్స్ పూర్తి చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించనున్నారు. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండో టెస్టులో ఆయన 35 రన్స్ చేస్తే ఇది సాధ్యమవుతుంది. కాగా, సచిన్, సంగక్కర, రికీ పాటింగ్‌ మాత్రమే 27వేల పరుగులు పూర్తిచేశారు. కోహ్లీ ఈ జాబితాలో చేరతారా?