News November 11, 2024
16లో 10.. మజ్లిస్ ‘మహా’ టార్గెట్!

మహారాష్ట్రలో కనీసం 10 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో మజ్లిస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోకి దిగింది. ఈసారి ముస్లిం ఓటు బ్యాంకు అధికంగా ఉన్న 16 చోట్ల తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రెండు వారాల పాటు 16 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. కాగా గత ఎన్నికల్లో MHలో MIM 35 చోట్ల పోటీ చేసి రెండు సీట్లు గెలుచుకుంది.
Similar News
News November 9, 2025
ఆముదపు విత్తులు ముత్యాలవుతాయా?

ఒక వస్తువు లేదా వ్యక్తి సహజ స్వభావం ఎప్పటికీ మారదు. ఆముదపు విత్తనాలు ఎప్పటికీ ఆముదపు విత్తనాలుగానే ఉంటాయి, అవి విలువైన ముత్యాలుగా మారవు. అలాగే దుర్మార్గులైన లేదా చెడ్డ స్వభావం కలిగిన వ్యక్తులు వారి ప్రవర్తనను మార్చుకోరని చెప్పడానికి.. సహజంగా జరగని లేదా అసాధ్యమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.
News November 9, 2025
కార్తీకంలో ఏ దానం చేస్తే ఏ ఫలితం?

దీప దానం చేస్తే అజ్ఞానం తొలగిపోతుంది.
అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.
వస్త్ర దానం వల్ల శివానుగ్రహం కలుగుతుంది.
స్వయంపాకం దానమిస్తే గౌరవం పెరుగుతుంది.
ఉసిరికాయలు దానం చేస్తే శుభం కలుగుతుంది.
గోదానంతో కృష్ణుడి కృప మీపై ఉంటుంది.
తులసి దానం చేస్తే మోక్షం లభిస్తుంది.
ధన దానం చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.
పండ్లను దానం చేస్తే సంతానం కలుగుతుంది.
News November 9, 2025
లాంచీలో శ్రీశైలం యాత్ర

TG: కృష్ణా నదిలో నల్లమల అందాలను వీక్షిస్తూ నాగర్కర్నూల్(D) సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ యాత్ర పున:ప్రారంభమైంది. మంగళ, గురు, శనివారాల్లో భక్తులు సోమేశ్వరుడిని దర్శించుకున్నాక 9AMకు లాంచీ బయలుదేరుతుంది. మల్లన్న దర్శనం తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. నిర్వాహకులు భోజనం, స్నాక్స్ అందిస్తారు. వన్ సైడ్ జర్నీకి పెద్దలకు ₹2000, పిల్లలకు ₹1600 వసూలు చేస్తారు. పూర్తి వివరాలకు https://tgtdc.in/లో చూడగలరు.


