News July 7, 2024
పిడుగుల పాటుకు 10 మంది మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720371020175-normal-WIFI.webp)
బిహార్ను పిడుగుల వర్షాలు వణికిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో ఆ రాష్ట్ర వ్యాప్తంగా పిడుగు పాటుకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండు వారాల్లో పిడుగులు పడి దాదాపు 40మంది మృతిచెందడం గమనార్హం. ప్రకృతి వైపరీత్యంతో సంభవించిన ఈ ఘటనల్లో మృతుల కుటుంబాలకు సీఎం నీతీశ్ కుమార్ ఎక్స్గ్రేషియో ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.4లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు.
Similar News
News July 19, 2024
గంభీర్ విషయంలో బోర్డుకు కోహ్లీ భరోసా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1721369812895-normal-WIFI.webp)
గంభీర్, కోహ్లీ ఇటీవల కలిసిపోయినట్లు కనిపిస్తున్నా టీం ఇండియాకు సంబంధించి ఒకే ఒరలో ఈ రెండు కత్తులు ఎలా కలిసుంటాయా అన్న అనుమానాలున్నాయి. బీసీసీఐ పెద్దలు కూడా ఇదే మీమాంసలో ఉండగా, ఏం పర్లేదంటూ కోహ్లీ వారికి చెప్పారట. ‘గంభీర్తో జరిగిన గత ఘటనలేవీ మా బంధంపై ప్రభావం చూపించవు. ఇద్దరం కలిసి భారత జట్టుకోసమే శ్రమిస్తాం. ఇందులో ఎటువంటి భయాలూ అక్కర్లేదు’ అని విరాట్ చెప్పారని బోర్డు వర్గాలు వెల్లడించాయి.
News July 19, 2024
రొట్టెల పండుగ నిర్వహణకు రూ.5కోట్లు: CBN
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719282159369-normal-WIFI.webp)
AP: ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా బారాషహీద్లో మూడో రోజు రొట్టెల పండుగకు వచ్చిన భక్తులతో ఆయన వర్చువల్గా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పండుగ నిర్వహణకు ప్రభుత్వం తరఫున రూ.5 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
News July 19, 2024
భారీ వర్షాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720092153531-normal-WIFI.webp)
AP: రాష్ట్రంలో కుండపోత వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. వరద ప్రభావం అధికంగా ఉన్న ఏలూరు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీసినట్లు మంత్రి చెప్పారు.