News September 23, 2024
పుష్పక్ బస్సుల్లో వెళ్లే వారికి 10శాతం డిస్కౌంట్
AP: హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు పుష్పక్ బస్సుల్లో వెళ్లేవారికి టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం బస్సు టికెట్ ధరలో 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి గ్రూప్గా వెళ్తే వారికి అదనంగా మరో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది.
Similar News
News September 23, 2024
పండుగ సీజన్లో ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా?
దసరా, దీపావళి పండుగలు వచ్చేస్తుండటంతో ఈ-కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తాయి. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు అధికారిక వెబ్సైట్లలోనే కొనుగోలు చేయాలి. మెసేజ్, ఈ-మెయిళ్లకు స్పందించకపోవడం ఉత్తమం. స్పందిస్తే మీ బ్యాంకు ఖాతాలో డబ్బు మాయమయ్యే అవకాశం ఉంది. అన్ని పోర్టల్లకు ఒకే పాస్ వర్డ్ ఉపయోగించకూడదు. ఫ్రీ హాట్స్పాట్లు ఉపయోగించి షాపింగ్ చేయొద్దు. హ్యాకింగ్కు గురయ్యే అవకాశం ఉంది.
News September 23, 2024
పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటా: టీపీసీసీ చీఫ్
TG: కార్యకర్తలు, నాయకులకు అనునిత్యం అందుబాటులో ఉంటానని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% స్థానాలు గెలిచేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కులం, మతం పేరుతో ప్రధాని మోదీ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.
News September 23, 2024
ఇద్దరు మహిళల్ని ఉరి తీయించిన కిమ్ జాంగ్
ఉత్తర కొరియాలో పరిస్థితుల గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ఇద్దరు మహిళల్ని ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉరి తీయించారు. వారిద్దరూ చైనాలో నివాసం ఉంటున్నారు. ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియా పారిపోవాలనుకున్న వారికి ఆ ఇద్దరూ సాయం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో వారిని కిమ్ స్వదేశానికి రప్పించి, విచారణ చేయించి ఉరి శిక్ష అమలు చేయించారు. ఇలాంటి ఆరోపణలే ఉన్న మరో 9మందికి జీవిత ఖైదు విధించారు.