News August 29, 2024
100 బిలియన్ ఎకానమీగా విశాఖను అభివృద్ధి చేస్తాం: మంత్రి లోకేశ్

మెరుగైన ఐటీ పాలసీతో ప్రఖ్యాత ఐటీ పరిశ్రమలను ఏపీకి రప్పిస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. గురువారం ఆయన ఓ హోటల్లో ఐటీ ప్రముఖులతో సమావేశమయ్యారు. 100 బిలియన్ ఎకానమీగా విశాఖ మహానగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా ఐటీ పరిశ్రమలకు రాయితీలను అందజేస్తామన్నారు. ఐటీలో ఎంత ఎక్కువ ఉద్యోగాలిస్తే అంత మెరుగైన ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఐటీ పరిశ్రమలు సహకరించాలని కోరారు.
Similar News
News December 11, 2025
విశాఖ వేదికగా పెన్షన్ అదాలత్

విశాఖపట్నంలో డిసెంబర్ 19న ‘పెన్షన్ అదాలత్’ కార్యక్రమం జరగనుంది. సిరిపురం వుడా చిల్డ్రన్స్ థియేటర్లో జరిగే ఈ సదస్సుకు ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శ్రీమతి ఎస్.శాంతి ప్రియ హాజరవుతారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారం, డీడీవోలకు సరైన మార్గనిర్దేశం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఉద్యోగులు, పెన్షనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
News December 11, 2025
సింహాచలంలో నెల గంట ముహూర్తం ఎప్పుడంటే ?

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి సన్నిధిలో నెలగంట ఉత్సవాన్ని ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 1:01 గంటకు శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నట్లు ఆలయ వైదిక సభ్యులు తెలిపారు. ఈ ధనుర్మాసంలో ఆలయంలో 10 రోజులు పగల్ పత్తు, మరో 10 రోజులు రాపత్తు ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. మరో ఐదు రోజులు దారోత్సవాలు, ధనుర్మాసం సందర్భంగా నెలరోజులు తిరుప్పావై పాశురాల పఠనం నిర్వహిస్తారు.
News December 11, 2025
విశాఖకు గూగుల్.. శంకుస్థాపన ఎప్పుడంటే?

విశాఖ ప్రజలకు మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. మార్చిలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. మరోవైపు విశాఖలోని ఐటీ హిల్స్పై 7ఐటీ కంపెనీలకు శుక్రవారం భూమిపూజ జరగనుంది. ఉదయం 11.30 గంటలకు నిర్వహించే కాగ్నిజెంట్ పూజలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ మేరకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఏర్పాట్లు చేస్తున్నారు.


