News May 22, 2024
100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
భవిష్యత్తు 2029- 30 ఆర్థిక సంవత్సరం నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించే విధంగా ప్రణాళికలు చేసుకోవాలని సింగరేణి డైరెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. గోదావరిఖనిలోని ఇల్లెందు క్లబ్లో రామగుండం, బెల్లంపల్లి రీజినల్ జనరల్ మేనేజర్లు, వివిధ విభాగాల అధికారులతో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న కాలంలో కొత్త గనుల ఏర్పాటు, గనుల విస్తరణపై చర్చించారు.
Similar News
News October 2, 2024
HSBD: బాపు షూట్లో గాంధీ జయంతి వేడుకలు
భారత జాతిపిత మాత్మ గాంధీ జయంతి వేడుకలను లాంగర్ హౌస్లోని బాబు షూట్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ జిష్ణు దేవ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మహాత్ముడికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. సత్యం అహింస శాస్త్రాలుగా చేసుకుని దేశానికి స్వతంత్రం సాధించి పెట్టిన మహనీయుడు అని అన్నారు.
News October 2, 2024
KNR: ఒక్కో రోజు ఒక్కో రూపంలో బతుకమ్మ
బతుకమ్మ సంబరాలు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగియనుంది. ఒక్కోరోజు ఒక్కో రూపంలో మహిళలు పూలతో బతుకమ్మను పూజిస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగింపు.
News October 2, 2024
కరీంనగర్: నేడు ఎంగిలిపూల బతుకమ్మ
నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు ఆట పాటలతో నిర్వహిస్తారు. మొదటి రోజైన అమావాస్య నాడు ‘ఎంగిలిపూల’ బతుకమ్మను పేరుస్తారు. సాధారణంగా మహాలయ అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మ మొదలవుతుంది. ఆనాడు ఇంటి యజమాని పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. పిండ ప్రదానం చేయలేని వాళ్లు పెద్దల పేరిట బ్రాహ్మణుడికి సాయిత్యం (వంట సామగ) ఇస్తారు.