News December 22, 2025

100% సబ్సిడీతో ఆయిల్‌పామ్ మొక్కలు

image

AP: ఆయిల్‌పామ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు ఇస్తోంది. 100% సబ్సిడీతో మొక్కలు సరఫరా చేస్తోంది. హెక్టారు(2.47ఎకరాలు)కు దిగుమతి మొక్కలకు ₹29 వేలు, స్వదేశీ మొక్కలకు ₹20 వేలు ఇస్తోంది. బోర్‌వెల్‌కు ₹25 వేలు, మోటారుకు ₹10 వేలు, పంట రక్షణ కోసం వైర్ మెష్ కంపోనెంట్‌ ఏర్పాటుకు ₹20 వేలు అందజేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 2.49 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగు చేస్తున్నారు.

Similar News

News December 25, 2025

GOVT శాఖల విద్యుత్ బకాయి ₹35,982 కోట్లు

image

TG: ప్రభుత్వ విభాగాల విద్యుత్ బిల్లుల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. TGSPDCL, NPDCLలు నోటీసులు ఇస్తున్నా ఫలితం లేకపోతోంది. సాగునీటి శాఖ ₹22,926 కోట్లు, HYD వాటర్ బోర్డు ₹7,084 కోట్లు చెల్లించాలి. మిషన్ భగీరథ ప్రాజెక్టు విభాగం ₹5,972 కోట్లు కట్టాల్సి ఉంది. గత 5 ఏళ్లుగా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. కాగా ఈ బకాయిల వసూలు బాధ్యతను కొత్తగా ఏర్పాటుచేసిన పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది.

News December 25, 2025

పిల్లలు త్వరగా పడుకోవాలంటే..

image

ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లలు లేటుగా పడుకొని ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే పిల్లలు ప్రతిరోజు ఒకే వేళకు నిద్రపోయేలా, ఒకే సమయానికి లేచేలా చూడాలి. దాంతో చక్కగా నిద్రపట్టి మెదడు చురుకుగా పనిచేస్తుంది. రాత్రిళ్లు పిల్లలు ఫోన్, టీవీ చూడకుండా వారికి ఆసక్తి కలిగించే కథలు చెప్పాలి. దీంతో త్వరగా నిద్రపోతారు. పిల్లలను నిద్రపుచ్చే సమయానికి గది వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూడాలి.

News December 25, 2025

భీమవరం డీఎస్పీ బదిలీ

image

AP: భీమవరం డీఎస్పీ <<18073175>>జయసూర్యను<<>> డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా బదిలీ చేశారు. ఆయన స్థానంలో కొత్త డీఎస్పీగా రఘువీర్‌‌ విష్ణును నియమించారు. జయసూర్యపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ చేయాలని అక్టోబర్‌లో డిప్యూటీ సీఎం పవన్ డీజీపీకి లేఖ రాశారు. ఆయన పేకాట నిర్వహణకు సహకరిస్తున్నారని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే జయసూర్య మంచి అధికారంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ అప్పట్లో కితాబిచ్చారు.