News October 3, 2024

100 మంది శిశువులకు ‘నస్రల్లా’ పేరు!

image

ఇజ్రాయెల్ దాడిలో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరాక్‌లో పుట్టిన 100 మంది శిశువులకు నస్రల్లా పేరు పెట్టుకున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదే ఆయనకు ఘన నివాళి అని పేర్కొంది. ఇరాక్‌లో ఎక్కువగా ఉండే షియా కమ్యూనిటీ ప్రజల్లో నస్రల్లాకు ఉన్న ఆదరణే ఇందుకు కారణం. మరోవైపు నస్రల్లా మరణంతో ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేస్తూ ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది.

Similar News

News December 1, 2025

అల్లూరి: నిర్వాసితులకు రేషన్ కష్టాలు.. 290 కి.మీ ప్రయాణం

image

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రేషన్ పంపిణీ విషయంలో స్థానికత సమస్య ఎదురవుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి రేషన్ బదిలీ కావడం లేదు. ఏలూరు జిల్లా నుంచి బియ్యం ఇవ్వడం లేదు. దీంతో నిర్వాసితులు పాత గ్రామానికి సుమారు 290 కిలోమీటర్లు ప్రయాణించి, వేల రూపాయల కిరాయి చెల్లించి రేషన్ తెచ్చుకుంటున్నారు. పునరావాస గ్రామాలను పోలవరం జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.

News December 1, 2025

ఇతిహాసాలు క్విజ్ – 83 సమాధానాలు

image

నేటి ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
సమాధానం: సోమవారానికి సోముడు అధిపతి. సోముడంటే చంద్రుడే. ఆ చంద్రుడిని శివుడు తన తలపై ధరిస్తాడు. అలా సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైనదిగా మారింది. జ్యోతిషం ప్రకారం.. సోమవారం రోజున శివుడిని పూజిస్తే చంద్రుడి ద్వారా కలిగే దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత, అదృష్టం లభిస్తాయని నమ్మకం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 1, 2025

వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

image

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.