News April 24, 2025

1000 మంది మావోలు.. చుట్టుముడుతున్న బలగాలు!

image

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో సుమారు 1000మంది మావోలను 20వేలమంది భారత బలగాలు చుట్టుముడుతున్నట్లు సమాచారం. దేశ చరిత్రలోనే ఇది అతి పెద్ద యాంటీ-నక్సల్ ఆపరేషన్‌గా కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు మావోయిస్టులకు చావు దెబ్బ తగలొచ్చని పేర్కొన్నాయి. ఇప్పటికే ఎన్‌కౌంటర్లో ఐదుగురు మావోలు మృతిచెందినట్లు సమాచారం. ఈ సంఖ్య భారీగా పెరగనుందని తెలుస్తోంది.

Similar News

News April 24, 2025

సింధు నదిలో ప్రతి నీటి చుక్కా మాదే: పాకిస్థాన్

image

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌‌తో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేయడంపై దాయాది దేశం స్పందించింది. సింధు నీటిలో ప్రతి నీటి చుక్కా తమ హక్కు అని తెలిపింది. ఒప్పందం నుంచి వైదొలగడం చట్ట వ్యతిరేకమని చెప్పింది. ఈ నిర్ణయాన్ని న్యాయ, రాజకీయపరంగా బలంగా ఎదుర్కొంటామని వివరించింది. ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు కుదిర్చిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదొలగలేదని ఆ దేశ మంత్రి అవాయిస్ లెఘారీ పేర్కొన్నారు.

News April 24, 2025

టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

image

AP: మే నెలలో జరిగే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల <>షెడ్యూల్‌<<>> విడుదలైంది.
✒ 19- ఫస్ట్ లాంగ్వేజ్& పేపర్-1(కాంపోజిట్ కోర్సు)
✒ 20- సెకండ్ లాంగ్వేజ్ ✒ 21- ఇంగ్లిష్ ✒ 22- గణితం
✒ 23- ఫిజిక్స్ ✒ 24- బయోలజీ ✒ 26- సాంఘిక శాస్త్రం
✒ 27- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2(కాంపోజిట్ కోర్సు)&OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2
✒ 28-OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2
* పరీక్షలన్నీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం

News April 24, 2025

హీరోయిన్ బేబీ బంప్(PHOTO)

image

ఇటీవల ప్రెగ్నెన్సీ ప్రకటించిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ బేబీ బంప్‌తో కనిపించారు. నిన్న రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆమె ముంబైలోని ఓ ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా కెమెరామెన్లు ఆమె ఫొటోలు తీయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై కియారా భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫొటోలు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించారు. కాగా కియారా, సిద్ధార్థ్ 2023లో పెళ్లి చేసుకున్నారు.

error: Content is protected !!