News January 10, 2025
ఏడాదికి 10వేల కోట్ల అరటిపండ్లు లాగిస్తున్నారు

అరటిపండు పోషకాలు కలిగి ఉండటం వల్ల, రోజుకు ఒకటైనా తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. దీంతో ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే పండుగా అరటిపండుకు పేరుంది. ఏటా 100 బిలియన్ల(10వేల కోట్లు) కంటే ఎక్కువ అరటిపండ్లను లాగిస్తున్నట్లు తెలుస్తోంది. పోషక ప్రయోజనాలు, సౌలభ్యం కారణంగా దీనికి ప్రజాదరణ లభించింది. చాలా చోట్ల ఆహారంలో అరటిపండునూ భాగం చేస్తుంటారు.
Similar News
News January 24, 2026
పట్టు వస్త్రాలు సమర్పించిన బండారు శ్రావణి

బుక్కరాయసముద్రం శ్రీ కొండమీద వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పట్టువస్త్రాలు సమర్పించారు. శుక్రవారం ఆమె కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
News January 24, 2026
లక్ష్యాలను సాధించి ‘ఎ’ గ్రేడ్ పొందాలి: కలెక్టర్

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల్లో ‘బి’, ‘సి’ గ్రేడ్లలో ఉన్న శాఖలు తమ పనితీరును మెరుగుపరుచుకుని ‘ఎ’ గ్రేడ్ సాధించాలని కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్లో కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPI) ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో అధికారులు అలసత్వం వహించకూడదని, ప్రగతి సూచికల్లో వెనుకబడిన శాఖలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
News January 24, 2026
పట్టు వస్త్రాలు సమర్పించిన బండారు శ్రావణి

బుక్కరాయసముద్రం శ్రీ కొండమీద వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పట్టువస్త్రాలు సమర్పించారు. శుక్రవారం ఆమె కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.


