News May 18, 2024

రూ.1,00,000కు చేరువలో కేజీ వెండి ధర!

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.800 పెరిగి రూ.68,400కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.870 పెరగడంతో రూ.74,620 పలుకుతోంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.4,000 పెరిగి రూ.96,500కు చేరింది. త్వరలోనే కేజీ సిల్వర్ రేటు రూ.లక్ష పలికే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

Similar News

News January 17, 2026

టాస్ ఓడిన భారత్

image

U-19 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం వల్ల టాస్ కాస్త ఆలస్యమైంది. తొలుత భారత్‌దే బ్యాటింగ్ కావడంతో వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే, కుందు చెలరేగితే భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది.
IND: ఆయుష్ మాత్రే(C), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్, విహాన్, కుందు, చౌహాన్, పంగాలియా, అంబరీష్, హెనిల్, దీపేశ్, ఖిలాన్ పటేల్

News January 17, 2026

మేడారం జాతర.. ఆర్టీసీ ఛార్జీల వివరాలివే

image

TG: మేడారం జాతరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నడిచే RTC ఎక్స్‌ప్రెస్ బస్సుల ఛార్జీల వివరాలను అధికారులు ప్రకటించారు. గోదావరిఖని నుంచి ₹400, హుజూరాబాద్ ₹320, హుస్నాబాద్ ₹350, కరీంనగర్ ₹390, పెద్దపల్లి ₹420, మంథని ₹350, కొత్తగూడెం ₹350, భద్రాచలం- ₹300, మణుగూరు ₹210, ఏటూరునాగారం ₹80, మంగపేట ₹110, పాల్వంచ ₹310, ఖమ్మం ₹480, కాళేశ్వరం ₹360, బెల్లంపల్లి ₹520, ఆసిఫాబాద్ నుంచి ₹590గా ఖరారు చేశారు.

News January 17, 2026

పశువుల్లో సంక్రమిత వ్యాధులు అంటే ఏమిటి?

image

పాడి పశువులకు సోకే వ్యాధుల్లో చాలావరకు బాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌, పరాన్నజీవుల వల్లే వస్తాయి. వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలు, స్రావాలు, శ్వాస ద్వారా వ్యాధికారక సూక్ష్మజీవులు బయటకు విడుదలవుతాయి. ఇవి ఇతర పశువులకు ఆహారం, నీరు, గాలి, గాయాల ద్వారా వ్యాపిస్తాయి. వ్యాధి సోకిన పశువుల పాలను సరిగా మరిగించకుండా, మాంసాన్ని బాగా ఉడికించకుండా తింటే మనుషులకూ వ్యాపిస్తాయి. వీటినే ‘సంక్రమిత వ్యాధులు’ అంటారు.