News October 8, 2024

UAE నుంచి భారత్‌కు $100bns పెట్టుబడులు: పీయూష్ గోయల్

image

రాబోయే సంవత్సరాల్లో UAE నుంచి $100bns పెట్టుబడులను భారత్ ఆకర్షిస్తుందని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి డేటా సెంటర్లు, AI, రెన్యూవబుల్ ఎనర్జీ, ట్రాన్స్‌మిషన్ ఇన్ఫ్రా రంగాల్లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రోత్సాహకంగా వారికి ఉచితంగా భూములు ఇస్తామన్నారు. ప్రస్తుతం ఈక్విటీల్లో UAE ప్రత్యక్ష పెట్టుబడులు $20bnsగా ఉన్నాయి. 2023లోనే $3bns వచ్చాయి.

Similar News

News October 8, 2024

గుండెలను పిండేసే ఘటన

image

AP: అన్నమయ్య జిల్లా రాజంపేటలో హృదయవిదారక ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో కొడుకు శ్యామ్(5) చనిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేక తల్లి శిరీష తల్లడిల్లింది. ఆస్పత్రిలో మృతదేహం పక్కనే పడుకుని అతడితో మాట్లాడుతూ ఉండిపోయింది. ‘కన్నయ్యా ఎంతసేపు పడుకుంటావు.. నిద్రలే’ అంటూ కలవరించడం అందరినీ కలిచివేసింది. పిల్లాడు నిద్రలేచాకే ఇంటికి వెళదామని ఆమె చెప్పడంతో తండ్రి, కుటుంబసభ్యులు విలపించారు.

News October 8, 2024

శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్!

image

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా ఆన్‌లైన్ వర్చువల్ బుకింగ్ చేసుకోవాలని కేరళ ప్రభుత్వం సూచించింది. దీనికోసం భక్తులు sabarimalaonline.org వెబ్‌సైట్‌కి వెళ్లి రిజిస్టర్‌పై క్లిక్ చేసి మీ ఫొటోతో వివరాలు ఎంటర్ చేయాలి. మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPతో ఖాతా ధ్రువీకరించి దర్శనానికి వెళ్లే రోజును ఎంచుకుని సబ్మిట్ కొడితే వర్చువల్ క్యూ టికెట్ వస్తుంది. రోజుకు 80వేల మందిని దర్శనానికి అనుమతిస్తారు.

News October 8, 2024

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

image

AP: ఇంటర్ మొదటి, రెండో ఏడాది చదివే విద్యార్థులు తప్పనిసరిగా 75 శాతం హాజరు కలిగి ఉండాలని బోర్డు కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. హాజరు శాతం 60-65గా ఉంటే రూ.2వేలు, 65-70గా ఉంటే రూ.1,500, 70-75గా ఉంటే రూ.వెయ్యి చెల్లించాలన్నారు. 60శాతం కంటే తక్కువ ఉన్న సైన్స్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అనర్హులని పేర్కొన్నారు. ఆర్ట్స్ విద్యార్థులను ప్రైవేట్‌గా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.