News November 30, 2024

పదేళ్లలో 102% పెరిగిన మెడికల్ కాలేజీలు: నడ్డా

image

దేశంలో డాక్టర్-జనాభా నిష్పత్తి WHO ప్రమాణం కన్నా మెరుగ్గా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. WHO ప్రకారం 1:1000గా ఉండగా దేశంలో ప్రతి 811 మందికి ఒక వైద్యుడు ఉన్నారని తెలిపారు. ఈ నెల వరకు మొత్తం 13,86,145 మంది వైద్యులు రాష్ట్ర, జాతీయ మెడికల్ కౌన్సిల్ వద్ద రిజిస్టర్ చేసుకున్నట్లు చెప్పారు. 2014లో 387 ప్రభుత్వం కాలేజీలు ఉంటే ఇప్పుడు 102% పెరిగి ఆ సంఖ్య 780గా ఉందన్నారు.

Similar News

News January 29, 2026

Oh Sh*t.. పైలట్ల ఆఖరి మాటలు ఇవే

image

బారామతి ఫ్లైట్ క్రాష్‌లో మహారాష్ట్ర Dy.CM అజిత్ పవార్ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పైలట్ ఇన్ కమాండ్ సుమిత్ కపూర్, ఫస్ట్ ఆఫీసర్ శాంభవి కూడా ప్రాణాలు కోల్పోయారు. క్రాష్ ల్యాండింగ్‌కి ముందు వాళ్లు మాట్లాడిన ఆఖరి మాటలు కాక్‌పిట్‌‌లో రికార్డ్ అయ్యాయి. వాళ్లు కొన్ని క్షణాల ముందు ‘Oh Sh*t’ అని కేకలు వేసినట్లు DGCA సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాసేపట్లో అజిత్ పవార్ అంత్యక్రియలు జరగనున్నాయి.

News January 29, 2026

APPLY NOW: ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో 97 పోస్టులు

image

<>ఇన్‌కమ్<<>> ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ముంబై రీజియన్‌లో స్పోర్ట్స్ కోటాలో 97 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్నేషనల్, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ, రాష్ట్ర స్థాయి, ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్‌లో పతకాలు సాధించినవారు అర్హులు. వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. క్రీడల్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://www.incometaxmumbai.gov.in

News January 29, 2026

ఒకే రోజు రూ.25వేలు పెరిగిన కేజీ సిల్వర్ ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ సిల్వర్ రేటు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.25వేలు పెరిగి రూ.4,25,000కు చేరింది. కేవలం 3 రోజుల్లోనే రూ.50వేలు పెరిగి ఇన్వెస్టర్లకు భారీ లాభాన్నిచ్చింది. ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో సిల్వర్ వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడమే ఈ పెరుగుదలకు కారణం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.