News November 22, 2024

మణిపుర్‌‌కు మ‌రో 10,800 మంది జవాన్లు

image

మ‌ణిపుర్‌కు కేంద్రం మ‌రో 90 కంపెనీల నుంచి 10,800 మంది జవాన్లను పంప‌నుంది. మే, 2023 నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో 258 మంది మృతి చెందారు. తాజాగా CRPF, BSF, ITBP, SSB నుంచి అద‌న‌పు బ‌ల‌గాల మోహ‌రింపుతో మొత్తం 288 కంపెనీల సిబ్బంది అక్కడి ప‌రిస్థితుల్ని పర్యవేక్షించనున్నారు. Nov 7న జిరిబమ్‌‌లో హ్మర్ తెగకు చెందిన మహిళను అనుమానిత మైతేయి మిలిటెంట్లు రేప్ చేసి కాల్చి చంపడంతో తిరిగి ఘర్షణ చెలరేగింది.

Similar News

News October 22, 2025

ఎలాంటి ప్రీమియం లేకుండా రూ.7లక్షల బీమా!

image

కుటుంబ పెద్ద చనిపోతే అతని భార్యాపిల్లలు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందిపడాల్సిందే. అందుకే ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని EPFO తన సభ్యులకు EDLI కింద ఆర్థిక భరోసా కల్పిస్తుంది. పీఎఫ్ ఖాతాదారుడు సర్వీస్‌లో ఉండగా మరణిస్తే కుటుంబానికి గరిష్ఠంగా రూ.7లక్షల వరకు ఉచిత బీమా లభిస్తుంది. దీనికి ఎలాంటి ప్రీమియం చెల్లించనవసరం లేదు. PF ఖాతాలో నామినీ వివరాలు అప్డేట్ చేసుకోవడం మరిచిపోకండి. SHARE IT

News October 22, 2025

SECLలో 1,138 పోస్టులు.. అప్లై చేశారా?

image

సౌత్ ఈస్ట్రర్న్ కోల్‌ఫీల్డ్స్ (SECL) 1,138 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. Asst ఫోర్‌మెన్(543 ), మైనింగ్ సిర్దార్, Jr ఓవర్‌మెన్(595) పోస్టులు ఉన్నాయి. మైనింగ్ సిర్దార్, Jr ఓవర్‌మెన్ జాబ్‌లకు OCT 30 అప్లైకి ఆఖరు తేదీ కాగా.. Asst ఫోర్‌మెన్ పోస్టులకు NOV 9 లాస్ట్ డేట్. పోస్టును బట్టి డిప్లొమా, BE, బీటెక్ పాసై ఉండాలి.
*మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 22, 2025

లిక్కర్ షాపులకు అప్లికేషన్లు.. లక్షకు చేరుతాయా?

image

TG: రాష్ట్రంలో లిక్కర్ షాపులకు దరఖాస్తులు లక్షకు చేరువలో ఉన్నాయి. ఇప్పటి వరకు 89,805 అప్లికేషన్లు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. రంగారెడ్డి(D)లో అత్యధికంగా 27వేలు, ఆదిలాబాద్(D)లో అత్యల్పంగా 3,894 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది. రేపటి వరకు అవకాశం ఉండటంతో లక్షకు చేరుకోవచ్చని అంచనా వేస్తోంది. 2,620 లిక్కర్​ షాపులకుగానూ వచ్చిన అప్లికేషన్లతో దాదాపు రూ.2,700 కోట్ల ఆదాయం సమకూరినట్లు సమాచారం.