News March 20, 2025
109 కేసుల్లో 73 ఛేదించాం: విశాఖ సీపీ

విశాఖ సిటీలో ఫిబ్రవరి నెలలో నమోదైన 109 చోరీ కేసుల్లో 73 ఛేదించామని సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. రూ.33.21లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. రూ.60లక్షల విలువైన 419 ఫోన్లను రికవరీ చేశామన్నారు. 660.655 గ్రాముల బంగారం, 2.08 గ్రా. వెండి, రూ.2,73,575 నగదు,14 బైకులు, 2ల్యాప్టాప్లు, 2గేదెలు, 3లారీ బ్యాటరీలు, 57 సెంట్రింగ్ షీట్లను బాధితులకు అందజేశారు. మిగతా కేసులు ఛేదిస్తున్నామన్నారు.
Similar News
News November 13, 2025
విశాఖలో నేడు సీఎం చంద్రబాబు షెడ్యూల్..

CII సమ్మిట్కు ముందుగా దేశంలోని ప్రముఖ కంపెనీల ఛైర్మన్లు, CEOలు, విదేశీ రాయబారులతో CM చంద్రబాబు నేడు భేటీ కానున్నారు.
➣ఉదయం నోవాటెల్లో ఇండియా-యూరోప్ బిజినెస్ రౌండ్టేబుల్ సమావేశం
➣‘పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్’- సస్టైనబుల్ గ్రోత్పై ప్రారంభ సెషన్
➣మధ్యాహ్నం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో భేటీ
➣ సాయంత్రం‘వైజాగ్ ఎకనామిక్ రీజియన్’పై కార్యక్రమం
➣ CII నేషనల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం
News November 12, 2025
విశాఖ: ఈనె 20 వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

విశాఖలో 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈనెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు.14న బాలల దినోత్సవం, 15న పుస్తక ప్రదర్శన, 16న చిత్రలేఖనం,17న వకృత్వ పోటీలు,18న సభ్యత్వ సేకరణ, 19న ఇందిరాగాంధీ జయంతి, మ్యూజికల్ చైర్ పోటీలు, 20న గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు విజేతలకు బహుమతులు ఇవ్వనున్నారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు గ్రంథాలయ అధికారులు తెలిపారు.
News November 12, 2025
విశాఖ: ‘వాహనదారులు నిబంధనలు పాటించాలి’

ఆటోరిక్షాలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని, స్కూల్ పిల్లలను ఆరుగురుకి మించి తీసుకెళ్లకూడదని ఉప రవాణా కమీషనర్ ఆర్.సి.హెచ్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. CC బస్సులో, టూరిస్ట్ బస్సులలో అత్యవసర ద్వారానికి అడ్డంగా టైర్లు, లగేజిలు ఉంచకూడదన్నారు. విశాఖలో పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగనున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా వాహనాలను నడపాలని సూచించారు.


