News February 19, 2025
10th పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్

తిరుపతి జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంగళవారం కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎక్కడా కూడా మాస్ కాపీయింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ఎలాంటి పొరపాట్లు లేకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
Similar News
News December 9, 2025
వరల్డ్ టాప్ డిఫెన్స్ కంపెనీల జాబితాలో HAL

వరల్డ్ TOP-100 డిఫెన్స్ కంపెనీల జాబితాలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 44వ స్థానంలో నిలిచింది. BEL 58, మజ్గాన్ డాక్ 91 ర్యాంకుల్లో నిలిచాయని SIPRI నివేదిక పేర్కొంది. ప్రపంచ ఉద్రిక్తతలతో 2024లో జాబితాలోని 77 కంపెనీల ఆదాయం పెరిగినట్లు తెలిపింది. కాగా ఇండియా ఆయుధ విక్రయాలు 8.2% పెరిగి $7.5B ఆదాయం సమకూరింది. ఆయుధ ఆదాయంలో 49% వాటా USదే. చైనా 13%, UK 7.7%, రష్యా 4.6% ఇండియా 1.1% వాటా కలిగి ఉన్నాయి.
News December 9, 2025
నగలను ఎలా శుభ్రం చేయాలంటే?

నగలను సరిగా శుభ్రం చేయకపోతే చెమట, దుమ్ము చేరి వాటి మెరుపు తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే గోరువెచ్చని నీటిలో షాంపూ/ డిష్ వాష్ డిటర్జెంట్ కలిపి నగలను పావుగంట ఉంచాలి. తర్వాత టూత్ బ్రష్తో మృదువుగా రుద్దాలి. తర్వాత మంచినీటిలో రెండుసార్లు శుభ్రపరిచి పొడివస్త్రంలో వేసి మునివేళ్లతో అద్దాలి. తడి ఆరనిచ్చి, భద్రపరుచుకోవాలి. షాంపూకి బదులు కుంకుడు రసం కూడా వాడి నగలను శుభ్రం చేయొచ్చు.
News December 9, 2025
పెద్దపల్లి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల పెంపు: DMHO

పెద్దపల్లి జిల్లా ఆరోగ్య శాఖలో జరిగిన సమీక్షలో డా. వి. వాణిశ్రీ ఆసుపత్రి ప్రసవాలను పెంచాలని, ప్రతి ఫుల్ టర్మ్ గర్భిణీని ట్రాక్ చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం జరిగేలా అవగాహన కల్పించాలని సూచించారు. క్షయ లక్షణాలు ఉన్నవారికి వెంటనే పరీక్షలు చేయాలని ఆదేశించారు. యాంటీబయోటిక్స్ను అవసరం ఉన్నప్పుడే వాడాలని తెలిపారు. 30 ఏళ్లు పైబడిన వారికి ఎన్సి డి స్క్రీనింగ్ నిర్వహించాలని సూచించారు.


