News April 23, 2025

10th RESULTS: హ్యాట్రిక్ కొట్టిన పార్వతీపురం మన్యం జిల్లా

image

పదో తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా హ్యాట్రిక్ కొట్టింది. వరుసగా మూడోసారి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలించింది.
➤ 2022-23 విద్యా సంవత్సరంలో 10,694 మంది పరీక్ష రాయగా 9,356(87.4%) మంది పాసయ్యారు
➤ 2023-24 విద్యా సంవత్సంలో 10,443 మంది పరీక్షకు హాజరవ్వగా 10,064(96.37%) మంది ఉత్తీర్ణత సాధించారు
➤ ఈఏడాది(2024-25) 10,286 మంది పరీక్ష రాయగా 9,659 (93.90%) మంది పాసయ్యారు.

Similar News

News April 23, 2025

విద్యార్థులకు మల్కాజిగిరి DCP కీలక సూచన

image

పరీక్షల్లో తప్పితే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని మల్కాజిగిరి DCP పద్మజా రెడ్డి హితవు పలికారు. ‘చదువు ఒక్కటే జీవితం కాదు. ఒక భాగ మాత్రమే. లైఫ్‌లో గెలుపోటములు సహజం. పరీక్షల్లో ఫెయిల్, తక్కువ మార్కులు వచ్చాయని బాధపడకుండా మళ్లీ ప్రయత్నించండి. పిల్లల భవిష్యత్తు కోసమే తల్లితండ్రులు కష్టపడుతున్నారు. విద్యార్థులు పట్టుదలతో ముందుకువెళ్లాలి’ అని DCP పద్మజా రెడ్డి మోటివేట్ చేశారు.

News April 23, 2025

సుల్తానాబాద్: లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సారెస్పీ అధికారులు

image

సుల్తానాబాద్‌లోని ఎస్సారెస్పీ డివిజన్ -6 కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేసే యాజాజ్ సిక్ లీవ్‌కి సంబంధించిన జీతం చెల్లించేందుకు సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు, సీనియర్ అసిస్టెంట్ సురేశ్ రూ.20వేలు లంచం డిమాండ్ చేశారు. SRSP అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో జరిగిన ఆపరేషన్లో నగదును స్వాధీనం చేసుకున్నారు.

News April 23, 2025

KZR : మే 20లోపు ఏకరూప దుస్తుల పంపిణీ: DEO

image

మే 20 లోపు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందించాలని జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. నేడు కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఏకరూప దుస్తుల కుట్టు కేంద్రాలను సందర్శించి, సకాలంలో దుస్తులను అందించాలన్నారు. అనంతరం భవిత కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి, నైపుణ్యాన్ని పరిశీలించారు.

error: Content is protected !!