News December 22, 2024
11 దేశాల ప్రవాసాంధ్రులతో మంత్రి కొండపల్లి జూమ్ కాన్ఫరెన్స్

యూరప్ లోని 11 దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రతినిధులతో ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ దేశాలలో ప్రవాసాంధ్రుల పరిస్థితులను, కష్టనష్టాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రవాసాంధ్రుల సమస్యలను పరిష్కరించేందుకు, సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారన్నారు.
Similar News
News April 19, 2026
VZM: చందానోత్సవానికి వచ్చే వారికి ముఖ్య గమనిక

ఏప్రిల్ 20న సింహచలం చందనోత్సవానికి వస్తున్న భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించడంలేదు. దేవస్థానం సుమారు 100 బస్సులు ఏర్పాటు చేసి భక్తులను కొండపైకి తీసుకెళ్లనుంది. అయితే అనకాపల్లి, గోపాలపట్నం, పెందుర్తి, కొత్తవలస నుంచి వచ్చే వారు పాతగోశాల, శ్రీనివాస కళ్యాణ మండపం, సింహపురి కాలనీ వద్ద బస్సులు ఎక్కాలి. హనుమంతువాక నుంచి వచ్చే భక్తులు కొత్త గోశాల, అడవివరం కొత్త టోల్ గేట్ బస్ స్టాప్ వద్ద బస్సులు ఎక్కాలి.
News April 18, 2026
VZM: ‘బీఎల్ఏలను త్వరగా నియమించాలి’

రాజకీయ పార్టీలు ప్రతీ పోలింగ్ కేంద్రానికి తమ ప్రతినిధులుగా బీఎల్ఏలను నియమించి, ఆ జాబితాను త్వరగా అందజేయాలని జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్.సత్తిబాబు కోరారు. తమ ఛాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. బీఎల్ఎలను నియమించుకోవడం ద్వారా ఎన్నికల ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు దోహదపడుతుందని అన్నారు.
News April 18, 2026
VZM: పైడితల్లమ్మ ఆలయం పనులు.. ఉత్తరాయణలోనే ప్రారంభించేలా చర్యలు

విజయనగరం పైడితల్లమ్మ దేవాలయం పునర్నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులతో శనివారం సమీక్షించారు. దేవాలయ ప్రాంగణం విస్తరణ, క్యూలైన్ వ్యవస్థ మెరుగుదల, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాయణ కాలంలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


