News February 12, 2025

11 నామినేషన్లు తిరస్కరణ: ఎన్నికల అధికారి

image

పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి 11 మంది అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెట్రి సెల్వి మంగళవారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మరో 43 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించామన్నారు. అభ్యర్థుల సమక్షంలో నామినేషన్లను పరిశీలన చేసామన్నారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకురాలు సునీత ఉన్నారన్నారు.

Similar News

News November 27, 2025

BHPL: నామినేషన్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి!

image

భూపాలపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో గణపురం, కొత్తపల్లిగోరి, రేగొండ, మొగుళ్లపల్లి మండలాల్లోని 82 గ్రామ పంచాయతీల పరిధిలోని 712 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, గ్రామాల్లో అభ్యర్థులు నామినేషన్ పత్రాలను ఇప్పటికే సిద్ధం చేసుకొని, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

News November 27, 2025

అయోధ్య ఆలయంలో హైదరాబాద్ కిటికీలు

image

కంచన్‌బాగ్‌లోని మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిథాని) సంస్థ అయోధ్యలోని రామాలయం కోసం కిటికీలను తయారుచేసింది. టైటానియం ఆర్కిటెక్చరల్‌ విండోలను తయారుచేసి అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి అందజేసినట్లు మిథాని అధికారులు తెలిపారు. 31 కీటికీలను తయారు చేసి ఆలయానికి ఇచ్చామని వివరించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రదక్షణ కారిడార్‌ కోసం ఇంజినీరింగ్‌ విభాగం వీటిని తయారుచేసింది.

News November 27, 2025

RR: తొలి విడతలో 7 మండలాలు.. 174 GPలు

image

రంగారెడ్డిలో మొత్తం 21 మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. తొలి విడతలో నామినేషన్లను నేటి నుంచి స్వీకరిస్తున్నారు. కొత్తూరు(12), నందిగామ(19), కేశంపేట(29), కొందుర్గు(22), చౌదరిగూడ(24), ఫరూఖ్‌నగర్(47), శంషాబాద్‌ 21 జీపీలకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 174 పంచాయతీల్లో 1530 వార్డులున్నాయి. 7 మండలాలకు 1530 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 11న ఎన్నిక, అదే రోజు ఫలితం వెలువడనుంది