News February 12, 2025

11 నామినేషన్లు తిరస్కరణ: ఎన్నికల అధికారి

image

పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి 11 మంది అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెట్రి సెల్వి మంగళవారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మరో 43 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించామన్నారు. అభ్యర్థుల సమక్షంలో నామినేషన్లను పరిశీలన చేసామన్నారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకురాలు సునీత ఉన్నారన్నారు.

Similar News

News October 21, 2025

సంగారెడ్డి: రేపు మంత్రి దామోదర్ పర్యటన

image

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం జిల్లాలో పర్యటిస్తారని క్యాంపు కార్యాలయం తెలిపింది. ఉదయం 11 గంటలకు జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో పీఎస్ఆర్ గార్డెన్‌లో జరిగే ఉచిత మెడికల్ క్యాంపుని ప్రారంభిస్తారని చెప్పారు. సాయంత్రం నాలుగు గంటలకు జోగిపేట మార్కెట్ కమిటీ ఆవరణలో వడ్ల కొనుగోలు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

News October 21, 2025

వరంగల్: వైన్‌షాపుల దరఖాస్తుల కోసం ఎదురు చూపులు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 294 వైన్స్ షాపులకు గాను ఈనెల 18 వరకు 9,754 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో టెండర్లు అనుకున్న స్థాయిలో రాకపోవడంతో ప్రభుత్వం ఈనెల 23 వరకు గడువు పెంచింది. దీంతో నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు ఆయా జిల్లాల్లో దరఖాస్తుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క దరఖాస్తు రాలేదని సమాచారం. వచ్చిన కూడా షాపునకు 4 లేదా 5 తప్ప ఎక్కువ వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.

News October 21, 2025

VZM: ‘పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకోవాలి’

image

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో ఉన్న స్మృతి వనంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత, ఎస్పీ దామోదర్ పాల్గొని అమరవీరుల స్మృతి స్థూపం వద్ద పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలన్నారు.