News May 10, 2024

11 సాయంత్రం ఎన్నికల ప్రచారానికి తెర

image

పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈనెల 11న సాయంత్రం తమ ప్రచారాలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన శుక్రవారం తెలిపారు. ప్రచారాలు నిలిపివేసిన సమయం నుండి పోలింగ్ పూర్తయ్యేంతవరకు మద్యంపై నియంత్రణ ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి అన్ని రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టామని, యువ ఓటర్లు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News February 10, 2025

నల్గొండ: బైక్‌తో గేదెను ఢీకొని వ్యక్తి మృతి

image

కొండమల్లేపల్లి మండలం గుమ్మడవల్లి గ్రామ పరిధిలో ఆదివారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలిలా.. గుర్రంపోడు మండలం మునింఖానిగూడెం గ్రామానికి చెందిన కృష్ణ (27) మల్లేపల్లి నుంచి వస్తున్నాడు. ఈ క్రమంలో బైక్‌ గేదెను ఢీకొట్టింది. తలకు తీవ్రగాయలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

News February 10, 2025

NLG: రేపు ముసాయిదా జాబితా విడుదల

image

మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. NLG జిల్లాలో 33 ZPTCలు, 352 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.

News February 10, 2025

నల్గొండ: ఉరి వేసుకుని యువకుడి సూసైడ్

image

నల్గొండ కలెక్టర్ ఆఫీస్ వెనుక ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద మహిళా ప్రాంగణం రెడ్డి కాలనీకి చెందిన వంశీ అనే వ్యక్తి ఆదివారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిది యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం కొండగడప. అతను నల్గొండ మహిళా ప్రాంగణం వద్ద ఉన్న లిక్కర్ కంపెనీలో హమాలీగా పని చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

error: Content is protected !!