News June 2, 2024
AP, TGలో వడదెబ్బతో 11 మంది మృతి

తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షం కురుస్తోంది. నిన్న వడదెబ్బతో తెలంగాణలో ఆరుగురు, ఏపీలో ఐదుగురు మరణించారు. TGలోని కరీంనగర్ జిల్లాలో ఇద్దరు, పెద్దపల్లి, హనుమకొండ, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు. ఏపీలో ప్రకాశం జిల్లాలో ముగ్గురు, ఏలూరు జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇవాళ కూడా రెండు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి.
Similar News
News October 26, 2025
ముల్తానీ మట్టితో ఎన్నో లాభాలు

ముల్తానీ మట్టికి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని చాలా రకాల సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి మొటిమలు, మచ్చలు తగ్గించడంలో దోహదపడుతుంది. ట్యాన్ నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. ఇది ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లకి మంచి ఫలితాలనిస్తుంది. ఇది చర్మంపై ఉన్న మురికిని, అదనపు నూనెను తొలగించి మెరిసే చర్మాన్నిస్తుంది.
News October 26, 2025
RTCలో ఉద్యోగాలు.. రెండు రోజులే ఛాన్స్

TGSRTCలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు 22-35 ఏళ్లు, శ్రామిక్ పోస్టులకు 18-30 ఏళ్ల వయసు ఉండాలి. SC, ST, BC, EWS కేటగిరీలకు 5 ఏళ్ల మినహాయింపు ఉంది. డ్రైవర్ పోస్టులకు పదో తరగతి పాసై ఉండాలి. హెవీ గూడ్స్ వెహికల్ లేదా హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. <
News October 26, 2025
ఎల్లుండి రాత్రి తుఫాను తీరం దాటే అవకాశం

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమైందని APSDMA అధికారులు వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో అది గంటకు 6 కి.మీ వేగంతో కదిలిందని తెలిపారు. రాబోయే 24 గంటల్లో తుఫానుగా, మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుండి అతిభారీ వర్షాలు ఉంటాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


