News June 2, 2024

AP, TGలో వడదెబ్బతో 11 మంది మృతి

image

తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షం కురుస్తోంది. నిన్న వడదెబ్బతో తెలంగాణలో ఆరుగురు, ఏపీలో ఐదుగురు మరణించారు. TGలోని కరీంనగర్ జిల్లాలో ఇద్దరు, పెద్దపల్లి, హనుమకొండ, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు. ఏపీలో ప్రకాశం జిల్లాలో ముగ్గురు, ఏలూరు జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇవాళ కూడా రెండు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి.

Similar News

News October 12, 2024

టూత్ బ్రష్‌లపై బ్యాక్టీరియాలను చంపే వైరస్‌లు!

image

షవర్ హెడ్స్, టూత్ బ్రష్‌లో మునుపెన్నడూ చూడని కొత్త వైరస్‌లను అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపు 614 వైరస్‌లను కనుగొన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఆశ్చర్యకర విషయమేంటంటే అవేవీ మానవాళికి హాని కలిగించేవి కాదు. పైపెచ్చు ఇవి హానికర బ్యాక్టీరియాలను చంపుతాయని పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా యాంటీబయాటిక్ రెసిస్టెంట్ సూపర్ బగ్‌లకు వ్యతిరేకంగా చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఈ వైరస్‌లు దోహదపడతాయి.

News October 12, 2024

విమాన ఘటనపై విచారణకు ఆదేశించిన డీజీసీఏ

image

తిరుచ్చిలో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ <<14334728>>ఘటనపై<<>> DGCA విచారణకు ఆదేశించింది. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన విడుదల చేశారు. 141 మందితో ఉన్న విమానం సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగిందన్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. పైలెట్‌తో పాటు విమాన సిబ్బందిని అభినందించారు. ప్రయాణికుల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.

News October 12, 2024

నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

image

AP: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు పర్వానికి చేరాయి. ఆఖరి రోజైన ఇవాళ స్వామివారికి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. దీంతో ఉత్సవాలు ముగియనున్నాయి. దీనికోసం ఇప్పటికే టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆఖరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు.