News October 9, 2025
SEBIలో 110 పోస్టులు

SEBI 110 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. OCT 30 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోస్టును బట్టి BE, బీటెక్, LLB, PG, CFA, CA, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఫేజ్1, ఫేజ్ 2 రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PWDలకు రూ.100. వెబ్సైట్: https://www.sebi.gov.in/
Similar News
News October 9, 2025
డీఎస్సీకి అభ్యర్థులు సన్నద్ధం కావాలి: లోకేశ్

AP: DSC, స్పెషల్ DSCలకు అభ్యర్థులు సన్నద్ధం కావాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. NOV చివరి వారంలో టెట్, 2026 JANలో DSC నోటిఫికేషన్, MARలో పరీక్షలు నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త డీఎస్సీ తర్వాత వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేయాలన్నారు.
News October 9, 2025
బేసిక్ పోలీసింగ్ మర్చిపోయారు: డీజీపీ

TG: రాష్ట్రంలో పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్తో బేసిక్ పోలీసింగ్ను మర్చిపోయారని DGP శివధర్ వ్యాఖ్యానించారు. ‘ఇకపై రెండూ ఉండాలి. వాహనాల చెకింగ్, కమ్యూనిటీ పోలీసింగ్తో పాటు ఇంటెలిజెన్స్ సేకరణకు ప్రాధాన్యమివ్వాలి. కిందిస్థాయి నుంచే ఇంటెలిజెన్స్ సేకరించాలి. శాంతిభద్రతల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. పోలీసులకు పార్టీలతో సంబంధం లేదు. ప్రజల రక్షణే ధ్యేయం’ అని SPలు, కమిషనర్ల సమావేశంలో మాట్లాడారు.
News October 9, 2025
TTDకి టోకరా వేయబోయి… చివరకు CBIకి చిక్కి

PMO Dy.Sec అంటూ మోసాలు చేస్తున్న వ్యక్తి తిరుమల బాలాజీ సాక్షిగా దొరికాడు. మే10న రామారావు అనే వ్యక్తి PMO అధికారినని 10 సుప్రభాత టికెట్లు, 3AC రూములు కావాలని TTD EOకు లేఖ ఇచ్చారు. అనుమానంతో అధికారులు PMOలో ఆరా తీయగా అలాంటి వ్యక్తి లేరని చెప్పారు. ఆపై PMO AD శర్మ CBIకి ఫిర్యాదు చేశారు. తాజాగా కేసు విచారణలో అతడు ఇదివరకూ పీఎంఓ JSనంటూ పుణే వర్సిటీలో అడ్మిషన్, మైసూరులో భూమి పత్రాలను పొందాడని తేలింది.