News August 24, 2025
1100కి డయల్ చేసి PGRS అర్జీ స్థితిని తెలుసుకోవచ్చు: కలెక్టర్

గుంటూరు జిల్లా వ్యాప్తంగా మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమాలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని అన్నారు. అలాగే, 1100 నెంబర్కు నేరుగా ఫోన్ చేసి కూడా ఫిర్యాదులు, వాటి స్థితిగతులను తెలుసుకోవచ్చని తెలిపారు.
Similar News
News August 24, 2025
గుంటూరు జిల్లాలో TODAY TOP NEWS

☞ గుంటూరులో భారీ అగ్నిప్రమాదం.. కార్లు దగ్ధం
☞ పల్నాడు యువకుడికి డీఎస్సీలో 3 ఉద్యోగాలు
☞ GNT: గంజాయి కేసులో నిందితులకు DSP కౌన్సెలింగ్
☞ గుంటూరులో కొనసాగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు
☞ రైతులకు న్యాయం చేయకుంటే ఉద్యమిస్తాం: అంబటి
☞ అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డులో మాక్ డ్రిల్
News August 24, 2025
గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ

గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సీనియర్ నాయకులు కూడా ఈ పదవి కోసం పోటీ పడుతుండటంతో రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. జిల్లాలో బీసీ వర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్ ఈ రేసులో ముందున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో పార్టీ అధిష్ఠానం ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటుందని నాయకులు భావిస్తున్నారు.
News August 24, 2025
గుంటూరులో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం నిధులు

గుంటూరు జిల్లాలో పర్యాటక రంగాన్ని ప్రోత్సాహించడానికి నిధులు మంజూరు చేయిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ మానస సరోవరం, ఉండవల్లి గుహలు వంటి వాటి అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. సూర్యఘర్ పథకం కింద నమోదైన లక్ష మందిలో కేవలం 3,600 మందికే పరికరాలు అమర్చారని, ఈ సమస్యలను పరిష్కరించి అందరికీ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు.