News April 5, 2024
రైల్వేలో 1113 అప్రెంటిస్ పోస్టులు

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పలు విభాగాల్లోని 1113 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల ప్రకారం టెన్త్, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 15 నుంచి 24 ఏళ్లలోపు వారు అర్హులు. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. అభ్యర్థులు మే 1వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ కోసం ఈ <
Similar News
News April 22, 2025
TDP నాయకులను వేధించడానికి జగన్ CIDని వాడారు: అనిత

AP: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమపై తప్పుడు కేసులు నమోదయ్యాయని, అయితే తమ వల్ల ఏ అధికారీ ఇబ్బంది పడలేదని హోంమంత్రి అనిత అన్నారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ PSR ఆంజనేయులు అరెస్ట్ నేపథ్యంలో మాట్లాడారు. YCP హయాంలో చేసిన తప్పుడు పనుల వల్లే అధికారులు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. TDP నాయకులను వేధించడానికి జగన్ CIDని వాడారని ఆరోపించారు. తమ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని మండిపడ్డారు.
News April 22, 2025
అత్యధిక పాస్ పర్సెంటేజ్ ఈ గ్రూప్లోనే..

TG: ఇవాళ విడుదలైన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో MPC గ్రూప్లోనే అత్యధిక మంది విద్యార్థులు పాసయ్యారు. అత్యల్పంగా HECలో పాస్ పర్సెంట్ నమోదైంది.
MPC: ఫస్టియర్- 76.65%, సెకండియర్ -72.23%
BPC: ఫస్టియర్- 67.88%, సెకండియర్ -71.93%
MEC: ఫస్టియర్- 65.53%, సెకండియర్ -56.96%
CEC: ఫస్టియర్- 45.56%, సెకండియర్ -46.92%
HEC: ఫస్టియర్- 34.51%, సెకండియర్ -46.26%
News April 22, 2025
రాష్ట్రం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు: జగన్

ఏపీలో కూటమి సర్కార్ దుష్ట సంప్రదాయాలకు తెరతీసిందని మాజీ CM జగన్ విమర్శించారు. కుట్ర పూరితంగా YCP శ్రేణులు, పోలీసులను అరెస్ట్ చేయడం కక్ష రాజకీయాలకు పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలో పార్టీ PAC సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం తప్ప ఏమీ కనిపించడం లేదు. అసలు రాష్ట్రం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.