News September 20, 2024
మోడల్ పాఠశాలల్లో 1,115 టెంపరరీ టీచర్లు

TG: రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో 1,115 మంది తాత్కాలిక టీచర్లను నియమించుకోవడానికి విద్యాశాఖ అనుమతిచ్చింది. 507 మంది PGTలు, 371 మంది TGTలు, 143 మంది హిందీ టీచర్లు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్స్ ఉన్న చోట అదనంగా 94 మందిని విధుల్లోకి తీసుకోనుంది. వీరు అవర్లీ బేస్డ్ టీచర్లు(HBT)గా వ్యవహరిస్తారు. నెలకు వేతనం రూ.18,200 ఇవ్వనుంది.
Similar News
News December 28, 2025
UGC-NET అడ్మిట్ కార్డులు విడుదల

డిసెంబర్ సెషన్కు సంబంధించి UGC-NET అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది. NETకు అప్లై చేసుకున్న వారు https://ugcnet.nta.nic.in/లో అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 85 సబ్జెక్టులకు సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. డిసెంబర్ 31, జనవరి 2, 3, 5, 6, 7తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. NET అర్హత సాధించడం ద్వారా JRF, డిగ్రీ, పీజీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహించవచ్చు.
News December 28, 2025
అలిపిరి మార్గంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ప్రారంభం

AP: తిరుమల అలిపిరి మెట్లమార్గంలోని 7వ మైలు వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను ప్రారంభించినట్లు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. నడకదారిలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా అపోలో కార్డియాక్ సెంటర్ సహకారంతో ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. శిక్షణ పొందిన సిబ్బందిచే తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇటీవల కాంగ్రెస్ MP వంశీకృష్ణ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ <
News December 28, 2025
పాపులెవరు? ఎలాంటి వారికి నరకంలో శిక్ష పడుతుంది?

వేదశాస్త్రాలను నిందించేవారు, గోహత్య, బ్రహ్మహత్య చేసేవారు కఠిన శిక్షార్హులు. పరస్త్రీలను ఆశించేవారు, తల్లిదండ్రులను, గురువులను హింసించేవారు, దొంగతనాలు చేసేవారిని పాపాత్ములుగా పరిగణిస్తారు. శిశుహత్య, శరణు కోరిన వారిని బాధించడం, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలను అపడం వల్ల కూడా నరకానికి పోతారట. ఈ దుశ్చర్యలు చేసే వారిని మరణానంతరం యమలోకానికి తీసుకెళ్లి, యముడి ఆజ్ఞ మేరకు నరకంలో కఠినంగా శిక్షిస్తారని నమ్మకం.


