News February 8, 2025
టెన్త్ అర్హతతో 1,124 ఉద్యోగాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1722947013757-normal-WIFI.webp)
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 1,124 ఖాళీలకు మార్చి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్/డ్రైవర్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులున్నాయి. టెన్త్ పాసై డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, 21-27 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. ఫిజికల్ టెస్ట్, రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.21,700-రూ.69,100 వరకు ఉంటుంది.
వెబ్సైట్: <
Similar News
News February 8, 2025
ఆటగాళ్ల ప్రాక్టీస్.. స్టేడియం ఫుల్..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739019874719_1032-normal-WIFI.webp)
ఇంగ్లండ్తో రేపు జరిగే రెండో వన్డే కోసం టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. భారత ఆటగాళ్లు నెట్ సెషన్లో బిజీ బిజీగా గడిపారు. కాగా తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు భారీగా ఒడిశా కటక్లోని బారాబతి స్టేడియానికి తరలివచ్చారు. దీంతో స్టేడియం కిక్కిరిసిపోయింది. ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా వారు బిగ్గరగా అరుస్తూ మద్దతిచ్చారు. ఇందుకు సంబంధించి ఫొటో SMలో వైరల్గా మారింది.
News February 8, 2025
VD12 టీజర్కు NTR, సూర్య వాయిస్ ఓవర్?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739018433921_746-normal-WIFI.webp)
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ‘VD12’ సినిమా టీజర్ ఈనెల 12న విడుదల కానుంది. అయితే, వివిధ భాషల్లో విడుదలవుతున్న ఈ టీజర్కు ఆయా ఇండస్ట్రీల స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. హిందీ టీజర్కు రణ్బీర్ కపూర్, తమిళంలో సూర్య, తెలుగుకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు టాక్. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
News February 8, 2025
కేజ్రీవాల్పై స్వాతి కోపమే శాపమైందా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739018796449_1323-normal-WIFI.webp)
ఆప్ రాజ్యసభ ఎంపీ <<15398600>>ట్వీట్తో<<>> సొంత పార్టీతో తనకు విభేదాలేంటనే చర్చ జరుగుతోంది. గతేడాది CMఆఫీస్లో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు తనపై దాడి చేశాడని స్వాతి ఆరోపించారు. ఈ ఘటనపై కేజ్రీవాల్ చర్యలు తీసుకోకపోగా కనీసం ఖండించలేదు. దీంతో ఆప్కు వ్యతిరేకంగా మారారు. ఢిల్లీలోని సమస్యలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసారు, యమునా నీటిసమస్యపై కేజ్రీవాల్ ఇంటికి ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ వైఫల్యాన్నిఎండగట్టారు.