News February 14, 2025

టెన్త్ అర్హతతో 1,154 పోస్టులు.. నేడే లాస్ట్

image

ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,154 పోస్టుల దరఖాస్తుకు నేడే చివరి తేదీ. ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, కార్పెంటర్, సివిల్ ఇంజినీర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, ఏసీ మెకానిక్ పోస్టులను భర్తీ చేయనుంది. రూ.100 ఫీజు చెల్లించి www.rrcecr.gov.in సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసై ఉండాలి. NCVT జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. అభ్యర్థుల వయసు 24 ఏళ్లలోపు ఉండాలి.

Similar News

News January 5, 2026

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,580 పెరిగి రూ.1,37,400కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,450 ఎగబాకి రూ.1,25,950 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.8,000 పెరిగి రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News January 5, 2026

వెనిజులా అధ్యక్షుడి అరెస్ట్.. ఇండియాపై ఎఫెక్ట్ ఎంత?

image

అమెరికా దళాలు వెనిజులా అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనివల్ల మన దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదని GTRI రిపోర్ట్ చెప్తోంది. ఒకప్పుడు మనం అక్కడి నుంచి భారీగా ముడి చమురు కొనేవాళ్లం. కానీ అమెరికా ఆంక్షల వల్ల 2020 నుంచి అది బాగా తగ్గిపోయింది. అందుకే అక్కడి గొడవలు మన ఎకానమీ లేదా ఎనర్జీ సెక్యూరిటీపై పెద్దగా ప్రభావం చూపించవని GTRI తెలిపింది.

News January 5, 2026

తండ్రైన క్రికెటర్ అంబటి రాయుడు

image

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు తండ్రయ్యారు. ఆయన భార్య విద్య మగ పిల్లాడికి జన్మనిచ్చారు. వారిద్దరితో దిగిన సెల్ఫీ ఫొటోను రాయుడు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కాగా విద్యను రాయుడు 2009లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన పలు లీగుల్లో ఆడుతూ క్రికెట్ కామెంటరీ కూడా చేస్తున్నారు.